ETV Bharat / state

'కరోనాపై యుద్ధంలో ప్రజల సహకారం మరింత అవసరం' - భారతదేశంలో కరోనా వైరస్

కరోనాపై యుద్ధంలో ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. స్వీయ నియంత్రణ ద్వారా ఈ మహమ్మారిని కట్టడి చేయొచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

union-minister-kishanreddy-about-corona
'కరోనాపై యుద్ధంలో ప్రజల సహకారం మరింత అవసరం'
author img

By

Published : Mar 28, 2020, 7:34 PM IST

కరోనాకి నిజమైన డాక్టర్లు ప్రజలేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ వైరస్​పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమన్నారు. దేశాల మధ్య యుద్ధం జరిగితే సైనికులు మాత్రమే పోరాడుతారని, కరోనాను పారద్రోలడానికి 130 కోట్ల ప్రజలు యుద్ధం చేస్తున్నారని కొనియాడారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశం మెరుగ్గా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకూ దేశంలో విమానాశ్రయాల ద్వారా 16 లక్షలు, ల్యాండ్ బోర్డర్ ద్వారా 20 లక్షల మంది వచ్చారని వారిలో 778 మందికి కరోనా సోకిందని తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య స్థానిక సంస్థల మధ్య సమన్వయం, నిత్యావసరాలు, మందుల సరఫరా, రవాణాను కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తోందని వివరించారు.

తెలంగాణలో అదనంగా నాలుగు కొత్త పరీక్షా కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు కిషన్​ రెడ్డి. ఏపీ ప్రభుత్వం కూడా తమకు ఎన్ని సెంటర్స్ కావాలంటే అన్ని పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కరోనాపై జాగ్రత్త పడటం వల్లే బాధితుల సంఖ్య 3 అంకెల్లోపే ఉన్నామని.. మరింత జాగ్రత్త పడితే స్టేజి 3కి వెళ్లకుండా తప్పించుకోవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:విపత్తు నిధులతో వలస కూలీలకు ఆహారం, వసతి

కరోనాకి నిజమైన డాక్టర్లు ప్రజలేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ వైరస్​పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమన్నారు. దేశాల మధ్య యుద్ధం జరిగితే సైనికులు మాత్రమే పోరాడుతారని, కరోనాను పారద్రోలడానికి 130 కోట్ల ప్రజలు యుద్ధం చేస్తున్నారని కొనియాడారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశం మెరుగ్గా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకూ దేశంలో విమానాశ్రయాల ద్వారా 16 లక్షలు, ల్యాండ్ బోర్డర్ ద్వారా 20 లక్షల మంది వచ్చారని వారిలో 778 మందికి కరోనా సోకిందని తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య స్థానిక సంస్థల మధ్య సమన్వయం, నిత్యావసరాలు, మందుల సరఫరా, రవాణాను కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తోందని వివరించారు.

తెలంగాణలో అదనంగా నాలుగు కొత్త పరీక్షా కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు కిషన్​ రెడ్డి. ఏపీ ప్రభుత్వం కూడా తమకు ఎన్ని సెంటర్స్ కావాలంటే అన్ని పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కరోనాపై జాగ్రత్త పడటం వల్లే బాధితుల సంఖ్య 3 అంకెల్లోపే ఉన్నామని.. మరింత జాగ్రత్త పడితే స్టేజి 3కి వెళ్లకుండా తప్పించుకోవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:విపత్తు నిధులతో వలస కూలీలకు ఆహారం, వసతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.