ETV Bharat / state

కాలువ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ - కృష్ణాజిల్లా రాజకీయ వార్తలు

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఇంటి దగ్గర కాలువ విషయంలో రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవ... రెండు పార్టీల వరకూ వెళ్లింది. అధికారులంతా ఒక్కటై తమకు అన్యాయం చేస్తున్నారని... దాడులకు దిగుతున్నారని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు.

two families fight each other about drainage issue in krishna dst g.konduru mandal venkatapuram
two families fight each other about drainage issue in krishna dst g.konduru mandal venkatapuram
author img

By

Published : Jun 23, 2020, 9:38 PM IST

Updated : Jun 24, 2020, 11:04 AM IST

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో కాలువ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం రెండు పార్టీల వరకూ వెళ్లింది. రోడ్డుపైన ఒక వర్గానికి చెందిన కుటుంబీకులు వివాహితపై దాడి చేశారు. ఇంటి ముందు మురుగునీరు వెళ్లడానికి వీలు లేకుండా కాలువ తవ్వారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా బెదిరిస్తున్నారని వాపోయారు.

కాలువ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ..

తమ సంతకాలు లేకుండానే పంచాయతీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. అలా చేస్తే ఎప్పటికీ తమ మురుగు నీరు సమస్య పరిష్కారం కాదని బాధితులు తెలిపారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి రోడ్డు నిర్మాణ పనులు ఆపించాలని చెప్పినా వైకాపా నాయకులు అండ చూసుకుని కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే తనపై దాడి చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఖరికి పోలీసులు సైతం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి తమనే కేసులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు. అధికారులు తమకు న్యాయం చెయ్యాలని.. ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి..

కరోనా ఉద్ధృతి పెరిగింది.. డిగ్రీ, వృత్తి విద్య పరీక్షలు రద్దు చేయండి: పవన్

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో కాలువ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం రెండు పార్టీల వరకూ వెళ్లింది. రోడ్డుపైన ఒక వర్గానికి చెందిన కుటుంబీకులు వివాహితపై దాడి చేశారు. ఇంటి ముందు మురుగునీరు వెళ్లడానికి వీలు లేకుండా కాలువ తవ్వారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా బెదిరిస్తున్నారని వాపోయారు.

కాలువ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ..

తమ సంతకాలు లేకుండానే పంచాయతీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. అలా చేస్తే ఎప్పటికీ తమ మురుగు నీరు సమస్య పరిష్కారం కాదని బాధితులు తెలిపారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి రోడ్డు నిర్మాణ పనులు ఆపించాలని చెప్పినా వైకాపా నాయకులు అండ చూసుకుని కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే తనపై దాడి చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఖరికి పోలీసులు సైతం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి తమనే కేసులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు. అధికారులు తమకు న్యాయం చెయ్యాలని.. ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి..

కరోనా ఉద్ధృతి పెరిగింది.. డిగ్రీ, వృత్తి విద్య పరీక్షలు రద్దు చేయండి: పవన్

Last Updated : Jun 24, 2020, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.