ETV Bharat / state

రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థుల ఆందోళన

author img

By

Published : Dec 11, 2020, 1:25 PM IST

రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

The protest of the villagers
గ్రామస్థుల ఆందోళన

రహదారి పరిస్థితి మెరుగుపరచాలని కృష్ణాజిల్లా అగ్రహారం గ్రామస్థులు ఆందోళన చేశారు. జగ్గయ్యపేట - ముక్త్యాల రహదారిలో తిరిగే భారీ వాహనాల వల్ల ధ్వంసమైన రోడ్లపై మోకాలిలోతు గుంతలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు.

రహదారి పరిస్థితి మెరుగుపరచాలని కృష్ణాజిల్లా అగ్రహారం గ్రామస్థులు ఆందోళన చేశారు. జగ్గయ్యపేట - ముక్త్యాల రహదారిలో తిరిగే భారీ వాహనాల వల్ల ధ్వంసమైన రోడ్లపై మోకాలిలోతు గుంతలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెదేపా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.