ETV Bharat / state

పాఠాలు చెబుతూనే.. ప్రాణాలు విడిచిన ఉపాధ్యాయిని - నపారుపూడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయిని మృతి వార్తలు

విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటుతో ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచిన ఘటన.. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం చినపారుపూడి ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

teacher dead
పాఠాలు చెబుతూ ప్రాణాలు విడిచిన ఉపాధ్యాయిని
author img

By

Published : Apr 13, 2021, 1:41 PM IST

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం చినపారుపూడి ప్రాథమిక పాఠశాలలో క్లాస్ రూమ్ లోనే ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటుతో మసిముక్కు శ్రీదేవి (54) మృతి చెందారు. తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఆమె స్కూల్ కు హాజరై విధులు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల సిబ్బంది వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం చినపారుపూడి ప్రాథమిక పాఠశాలలో క్లాస్ రూమ్ లోనే ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటుతో మసిముక్కు శ్రీదేవి (54) మృతి చెందారు. తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఆమె స్కూల్ కు హాజరై విధులు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల సిబ్బంది వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

ఇవీ చూడండి:

రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సిన్.. రెండు రోజుల పాటు టీకా ఉత్సవ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.