ETV Bharat / state

మంత్రులంతా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్​లు : కొల్లు రవీంద్ర - పేదలకు ఇళ్ల స్థలాలపై కొల్లు రవీంద్ర కామెంట్స్

మంత్రులంతా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్​లు అయితే...అందులో మంత్రి బొత్స సత్యనారాయణ మొదటి స్థానంలో ఉంటారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. పేదలకు ఇళ్లు కేటాయించడం చేతకాక తెదేపాపై విమర్శలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా తెదేపాను విమర్శించడం తప్ప అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై తెదేపా నేతలు కోర్టుకు వెళ్లరంటూ కొడాలి నాని చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని కొల్లు రవీంద్ర సవాల్ చేశారు.

కొల్లు రవీంద్ర
కొల్లు రవీంద్ర
author img

By

Published : Nov 11, 2020, 8:02 PM IST

రాష్ట్ర మంత్రులంతా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లైతే అందులో మొదటి స్థానం బొత్స సత్యనారాయణదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. పేదలకు ఇళ్లు పంచటం చేతకాక మంత్రి బొత్స తెదేపాపై అవినీతి ముద్రవేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్​కు ఊరికో ప్యాలెస్ ఉండొచ్చుగానీ, సామాన్యుడికి నాణ్యమైన ఇల్లు ఉండకూడదా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా ఇంకా తెదేపాపై విమర్శలు చేస్తున్నారు తప్ప.. చేసిన అభివృద్ధి శూన్యమని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

ఇళ్ల స్థలాల పంపిణీలో ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలు కాజేసి మరింత దోపిడీ కోసమే పట్టాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. ఇళ్లస్థలాల పంపిణీపై చంద్రబాబు కోర్టుకు వెళ్లారంటూ అసత్యాలు మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని దానిని నిరూపించాలని సవాల్ విసిరారు. వైకాపా నేతలే కోర్టుకెళ్లారని నిరూపించేందుకు తాము సిద్ధమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాల పంపిణీలో కోర్టు వివాదాల్లో ఉన్న కేవలం 2 వేల ఎకరాలేనన్నారు. మిగిలిన స్థలాల పంపిణీ చేయలేకపోవడం వైకాపా చేతకాని తనమని విమర్శించారు.

రాష్ట్ర మంత్రులంతా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లైతే అందులో మొదటి స్థానం బొత్స సత్యనారాయణదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. పేదలకు ఇళ్లు పంచటం చేతకాక మంత్రి బొత్స తెదేపాపై అవినీతి ముద్రవేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్​కు ఊరికో ప్యాలెస్ ఉండొచ్చుగానీ, సామాన్యుడికి నాణ్యమైన ఇల్లు ఉండకూడదా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా ఇంకా తెదేపాపై విమర్శలు చేస్తున్నారు తప్ప.. చేసిన అభివృద్ధి శూన్యమని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

ఇళ్ల స్థలాల పంపిణీలో ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలు కాజేసి మరింత దోపిడీ కోసమే పట్టాలు ఇవ్వట్లేదని ఆరోపించారు. ఇళ్లస్థలాల పంపిణీపై చంద్రబాబు కోర్టుకు వెళ్లారంటూ అసత్యాలు మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని దానిని నిరూపించాలని సవాల్ విసిరారు. వైకాపా నేతలే కోర్టుకెళ్లారని నిరూపించేందుకు తాము సిద్ధమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాల పంపిణీలో కోర్టు వివాదాల్లో ఉన్న కేవలం 2 వేల ఎకరాలేనన్నారు. మిగిలిన స్థలాల పంపిణీ చేయలేకపోవడం వైకాపా చేతకాని తనమని విమర్శించారు.

ఇదీ చదవండి

విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధి మారబోతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.