ETV Bharat / state

'ఎవరి ఆదేశాలతో రైతులకు బేడీలు వేశారు?'

author img

By

Published : Oct 29, 2020, 10:57 PM IST

రైతులకు బేడీలు వేసిన ఘటనపై తెదేపా నేత వర్లరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో బేడీలు వేశారని మండిపడ్డారు. మరో అధికారితో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

TDP leader varla ramayya fire on YCP government
తెదేపా నేత వర్లరామయ్య

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజికవర్గమైతే రైతులకు బేడీలు వేసేవారా? అని తెదేపా నేత వర్ల రామయ్య నిలదీశారు. అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుపడుతూ... డీజీపీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ... రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. ఇది క్షమించరాని నేరమని లేఖలో పేర్కొన్నారు.

అందోళన చేస్తున్న అన్నదాతలకు ఎవరి ఆదేశాలతో బేడీలు వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ తప్పులతడకగా సాగుతోందని, మరో అధికారితో పునర్విచారణ జరిపించాలని కోరారు. తెదేపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనందనలు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజికవర్గమైతే రైతులకు బేడీలు వేసేవారా? అని తెదేపా నేత వర్ల రామయ్య నిలదీశారు. అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుపడుతూ... డీజీపీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ... రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. ఇది క్షమించరాని నేరమని లేఖలో పేర్కొన్నారు.

అందోళన చేస్తున్న అన్నదాతలకు ఎవరి ఆదేశాలతో బేడీలు వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ తప్పులతడకగా సాగుతోందని, మరో అధికారితో పునర్విచారణ జరిపించాలని కోరారు. తెదేపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనందనలు తెలిపారు.

ఇదీ చదవండి:

వ్యాపార విజయం: భార్య ఆలోచన.. భర్త కార్యాచరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.