ETV Bharat / state

'వైకాపా పాలనలో... న్యాయం ఖరీదైన వస్తువైంది'

author img

By

Published : Sep 9, 2020, 11:59 PM IST

బందరులో పద్మజ అనే ఎస్సీ మహిళను హత్య చేస్తే మంత్రి పేర్ని నాని ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి జవహర్‌ ప్రశ్నించారు. మంత్రులు ప్రజలతో ఉండాలి గానీ రౌడీషీటర్లు, నేరస్థులతో పనేంటని మండిపడ్డారు.

tdp leader javahar comments on minister perni nani
మంత్రి పేర్నీ నానిపై మాజీమంత్రి జవహర్ విమర్శలు

మంత్రి పేర్ని నానిపై మాజీ మంత్రి జవహర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. బందరులో పద్మజ అనే ఎస్సీ మహిళను హత్య చేశారని అన్నారు. అనుచరుడు హత్యచేసి పట్టుబడితే పేర్ని నాని ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. మంత్రులు ప్రజలతో ఉండాలిగానీ రౌడీషీటర్లు, నేరస్థులతో పనేంటి? అని మండిపడ్డారు.

16 నెలల కాలంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో న్యాయం ఖరీదైన వస్తువుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తక్షణమే మంత్రి పేర్ని నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి పేర్ని నానిపై మాజీ మంత్రి జవహర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. బందరులో పద్మజ అనే ఎస్సీ మహిళను హత్య చేశారని అన్నారు. అనుచరుడు హత్యచేసి పట్టుబడితే పేర్ని నాని ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. మంత్రులు ప్రజలతో ఉండాలిగానీ రౌడీషీటర్లు, నేరస్థులతో పనేంటి? అని మండిపడ్డారు.

16 నెలల కాలంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో న్యాయం ఖరీదైన వస్తువుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తక్షణమే మంత్రి పేర్ని నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

అండగా నిలిచారు..ఆకలి తీర్చారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.