బొప్పరాజు అమరావతి జేఏసీ పేరుతో అందరనీ మోసం చేస్తున్నారని.. అందుకే కొత్త అసోసియేషన్ కార్యవర్గం ఎన్నుకున్నామని వీఆర్వోల సంఘం నూతన అధ్యక్షుడు రవీంద్ర రాజు పేర్కొన్నారు. రాష్ట్ర వీఆర్వో సంఘం ప్రతినిధుల సమావేశం విజయవాడలో నిర్వహిచారు. 12 జిల్లాల నుంచి హాజరైన అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. ముఖ్య అతిధులుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిలు పాల్గొన్నారు. సంఘంలో ఇద్దరు వ్యక్తులతో.. బొప్పరాజు చీకటి ఒప్పందం చేసుకున్నారని రవీంద్రరాజు ఆరోపించారు. వారి కుట్రలు తెలిసినందునే.. కొత్త కార్యవర్గానికి 14 వేల మంది వీఆర్వోలు అండగా నిలిచారన్నారు.
ఇవీ చూడండి...