ETV Bharat / state

రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో ఆకట్టుకున్న సైన్స్​ ఎక్స్​ఫ్లోరా వైజ్ఞానిక ప్రదర్శన

author img

By

Published : Nov 7, 2022, 7:34 PM IST

Science XFlora At Ramadevi Public School: తెలంగాణలోని అబ్దుల్లాపూర్​మెట్​లోని రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ఎక్స్​ఫ్లోరా అనే పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్​ఫైర్​ కార్యక్రమాన్ని ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

మాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ఫ్లోరా
మాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ఫ్లోరా

Science XFlora At Ramadevi Public School: వైజ్ఞానిక ప్రదర్శనలతో పిల్లల్లో సృజనాత్మకత, సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందని పాఠశాల పూర్వ విద్యార్థి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి అన్నారు. అబ్దుల్లాపూర్​మెట్​లోని రమాదేవి పబ్లిక్ స్కూల్​లో 3రోజుల పాటు నిర్వహిస్తున్న సైన్స్​ఎక్స్​ఫ్లోరా ఎగ్జిబిషన్​ను బృహతి ప్రారంభించారు. ఎగ్జిబిషన్​లో పాఠశాల విద్యార్థులు రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు ఈరోజు నుంచి బుధవారం వరకు ఉంటాయని, శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొంటారని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా తెలిపారు.

వాతావరణ కాలుష్యాన్ని ఏ విధంగా నివారించాలని, ఔషధ మొక్కలు వాటి ప్రాధాన్యత, ప్లాస్టిక్ నియంత్రణతో పాటు రీసైక్లింగ్, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, నీటి విద్యుత్ సౌర విద్యుత్ వాటిపై అవగాహన పెంచే విధంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడంతో పాటు భవిష్యత్తులో ప్రపంచానికి, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా అన్నారు. అంతేకాకుండా నూతన ఆవిష్కరణలను చేయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమాదేవి ట్రస్టీ మెంబర్ రావి చంద్రశేఖర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Science XFlora At Ramadevi Public School: వైజ్ఞానిక ప్రదర్శనలతో పిల్లల్లో సృజనాత్మకత, సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందని పాఠశాల పూర్వ విద్యార్థి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి అన్నారు. అబ్దుల్లాపూర్​మెట్​లోని రమాదేవి పబ్లిక్ స్కూల్​లో 3రోజుల పాటు నిర్వహిస్తున్న సైన్స్​ఎక్స్​ఫ్లోరా ఎగ్జిబిషన్​ను బృహతి ప్రారంభించారు. ఎగ్జిబిషన్​లో పాఠశాల విద్యార్థులు రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు ఈరోజు నుంచి బుధవారం వరకు ఉంటాయని, శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొంటారని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా తెలిపారు.

వాతావరణ కాలుష్యాన్ని ఏ విధంగా నివారించాలని, ఔషధ మొక్కలు వాటి ప్రాధాన్యత, ప్లాస్టిక్ నియంత్రణతో పాటు రీసైక్లింగ్, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, నీటి విద్యుత్ సౌర విద్యుత్ వాటిపై అవగాహన పెంచే విధంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడంతో పాటు భవిష్యత్తులో ప్రపంచానికి, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా అన్నారు. అంతేకాకుండా నూతన ఆవిష్కరణలను చేయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమాదేవి ట్రస్టీ మెంబర్ రావి చంద్రశేఖర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ఫ్లోరా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.