ETV Bharat / state

మద్యం మత్తులో బైక్​ నడిపాడు.. ప్రాణాలు కోల్పోయాడు

కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పాడు కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో మితి మీరిన వేగంతో ద్విచక్రవాహనం నడిపిన యువకుడు డివైడర్​ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు.

author img

By

Published : Nov 7, 2019, 7:23 PM IST

మద్యం మత్తులో డీవైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు మృతి
మద్యం మత్తులో డీవైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు మృతి

కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పాడు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అజయ్​ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి గుణదల పడవల రేవు కూడలిలోలని బీఆర్టీఎస్​ రోడ్డులో స్నేహితుని పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న యువకులు మద్యం తాగి ద్విచక్రవాహనాలతో నగర రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఈ క్రమంలో రామవరప్పాడు కూడలి వద్ద అజయ్​ నడుపుతోన్న బైక్​ అదుపు తప్పి డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అజయ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. దోమల యశ్వంత్​ అనే మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గోస్ట్​ రైడర్​ పేరుతో అర్ధరాత్రి యువకులు మితిమీరిన వేగంతో బైక్​ నడుపుతూ.. భయాందోళనకు గురి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో డీవైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు మృతి

కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పాడు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అజయ్​ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి గుణదల పడవల రేవు కూడలిలోలని బీఆర్టీఎస్​ రోడ్డులో స్నేహితుని పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న యువకులు మద్యం తాగి ద్విచక్రవాహనాలతో నగర రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఈ క్రమంలో రామవరప్పాడు కూడలి వద్ద అజయ్​ నడుపుతోన్న బైక్​ అదుపు తప్పి డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అజయ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. దోమల యశ్వంత్​ అనే మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గోస్ట్​ రైడర్​ పేరుతో అర్ధరాత్రి యువకులు మితిమీరిన వేగంతో బైక్​ నడుపుతూ.. భయాందోళనకు గురి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ప్రమాదవశాత్తు నాపరాయి యంత్రంలో చిక్కుకుని బాలిక మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.