ETV Bharat / state

ఉద్ధరిస్తామని, ఉరికంబం ఎక్కిస్తున్నారు: మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఫైర్

author img

By

Published : Mar 28, 2021, 12:35 PM IST

ఎన్నికల ముందు రైతులను ఉద్దరిస్తామంటూ ప్రగల్బాలు పలికి.. ఇప్పుడు ఉరి కంబం ఎక్కిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే సీఎం జగన్  తీవ్రమైన ఉద్యమం ఎదుర్కొంటారని హెచ్చరించారు. వరిసాగుపై మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Repalle MLA Angani Satyaprasad
మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఫైర్

వరిసాగు పట్ల మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. వరి సోమరిపోతు వ్యవసాయమని మంత్రి వ్యాఖ్యనించటం సిగ్గుచేటన్నారు. మంత్రి మాటలు.. రైతు కష్టాన్ని అవమానించడమేనన్న ఆయన.. కష్టపడకుండా ఎలా పండించాలో శ్రీరంగనాథరాజు చెప్తే రైతులు నేర్చుకుంటారని మండిపడ్డారు.

రైతాంగానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా రెండేళ్ల పాలనలో 760 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న ఆయన.. శ్రీరంగనాథరాజు వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.

వరిసాగు పట్ల మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. వరి సోమరిపోతు వ్యవసాయమని మంత్రి వ్యాఖ్యనించటం సిగ్గుచేటన్నారు. మంత్రి మాటలు.. రైతు కష్టాన్ని అవమానించడమేనన్న ఆయన.. కష్టపడకుండా ఎలా పండించాలో శ్రీరంగనాథరాజు చెప్తే రైతులు నేర్చుకుంటారని మండిపడ్డారు.

రైతాంగానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా రెండేళ్ల పాలనలో 760 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న ఆయన.. శ్రీరంగనాథరాజు వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.

ఇవీ చూడండి:

'కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.. అప్రమత్తత అవసరం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.