ETV Bharat / state

'కమీషన్లు చెల్లించండి.. బీమా సౌకర్యం కల్పించండి'

author img

By

Published : Jul 16, 2020, 3:33 PM IST

జగ్గయ్యపేటలోని పౌర సరఫరా గోదాముల వద్ద బియ్యం సరఫరాను రేషన్​ డీలర్లు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. డీలర్ల సంఘం ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంతవరకు తమకు కమీషన్​ చెల్లించలేదని ఆరోపించారు.

Ration dealers stoped rice supply
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్​ డీలర్లు ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. జగ్గయ్యపేటలోని పౌర సరఫరా గోదాముల వద్ద బియ్యం సరఫరాను అడ్డుకున్నారు. తమ సమస్యలు తీర్చే వరకు ఎనిమిదో విడత రేషన్ పంపిణీ చేయబోమని స్పష్టం చేశారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే కమీషన్ చెల్లించడం లేదని రేషన్ డీలర్లు ఆరోపించారు. ఏడు విడతలుగా సరఫరా చేసిన రేషన్ సరుకులకు ఇంతవరకు కమీషన్ ఇవ్వలేదని, వాటిని వెంటనే చెల్లించాలని తేల్చి చెప్పారు. బయోమెట్రిక్ విధానాన్ని తొలిగించి, డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. జగ్గయ్యపేటలోని పౌర సరఫరా గోదాముల వద్ద బియ్యం సరఫరాను అడ్డుకున్నారు. తమ సమస్యలు తీర్చే వరకు ఎనిమిదో విడత రేషన్ పంపిణీ చేయబోమని స్పష్టం చేశారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే కమీషన్ చెల్లించడం లేదని రేషన్ డీలర్లు ఆరోపించారు. ఏడు విడతలుగా సరఫరా చేసిన రేషన్ సరుకులకు ఇంతవరకు కమీషన్ ఇవ్వలేదని, వాటిని వెంటనే చెల్లించాలని తేల్చి చెప్పారు. బయోమెట్రిక్ విధానాన్ని తొలిగించి, డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

అయినవారికి ఎలా ఉందో తెలియక... లోనికి వెళ్లలేక ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.