కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెం గ్రామంలో స్మశానం స్థలాన్ని కబ్జా చేయడాన్ని నిరసిస్తూ... స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. నూజివీడు-విజయవాడ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. తమ గ్రామ స్మశాన భూమి తమకే అప్పగించాలని, సమస్యలను పరిష్కరించే వరకు నిరసన విరమించేదిలేదని దళితులు స్పష్టం చేశారు. గ్రామస్థుల ఆందోళన కారణంగా ఆ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఇది చదవండి జులై 8న ఉచిత ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ: సీఎం జగన్