ETV Bharat / state

ఏదైతే అది జరిగిందని జెడ్ స్పీడ్ లో వెళ్లారు.. చివరికి! - seb officers seized illigal liquor

కర్నూలు జిల్లాలో ఓ కారు భీభత్సం సృష్టించింది. ఎస్ఈబీ అధికారులు ఆ కారును తనిఖీ చేపట్టాలని ప్రయత్నించగా.. బారికేడ్లను ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది.

కారును పట్టుకున్న పోలీసులు
కారును పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Aug 28, 2021, 7:40 PM IST

వేగంగా దూసుకెళ్తున్న కారు

కర్నూలు శివారు పంచలింగాల చెక్ పోస్టు వద్ద అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు తనిఖీలు చేస్తున్న ఎస్ఈబీ పోలీసులకు ఓ కారు చుక్కలు చూపించింది. ఆర్మీ అని ఉన్న నల్ల కారును పోలీసులు ఆపినా.. బారికేడ్లను దాటి వేగంగా వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడించారు.

సంజీవని ఆసుపత్రి ఎదురుగా ఓల్డ్ పంప్ హౌస్ వద్ద కారును ఆపేసి ఇద్దరు యువకులు పారిపోయారు. కారులో తనిఖీలు చేయగా రెండు బాక్సుల తెలంగాణ మద్యాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.

ఇదీ చదవండి:

టీచర్​గా మారిన ఎమ్మెల్యే రోజా.. విద్యార్థులకు సోషల్ పాఠాలు

వేగంగా దూసుకెళ్తున్న కారు

కర్నూలు శివారు పంచలింగాల చెక్ పోస్టు వద్ద అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు తనిఖీలు చేస్తున్న ఎస్ఈబీ పోలీసులకు ఓ కారు చుక్కలు చూపించింది. ఆర్మీ అని ఉన్న నల్ల కారును పోలీసులు ఆపినా.. బారికేడ్లను దాటి వేగంగా వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడించారు.

సంజీవని ఆసుపత్రి ఎదురుగా ఓల్డ్ పంప్ హౌస్ వద్ద కారును ఆపేసి ఇద్దరు యువకులు పారిపోయారు. కారులో తనిఖీలు చేయగా రెండు బాక్సుల తెలంగాణ మద్యాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.

ఇదీ చదవండి:

టీచర్​గా మారిన ఎమ్మెల్యే రోజా.. విద్యార్థులకు సోషల్ పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.