ETV Bharat / state

పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్​కు అస్వస్థత

కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బోడె ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ప్రచారం చేస్తుండగా వడదెబ్బతో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Apr 1, 2019, 4:17 AM IST

బోడె ప్రసాద్
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్​కు అస్వస్థత
కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బోడె ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పగలంతా కంకిపాడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సాయంత్రం ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తాడిగడపలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన డీహైడ్రేషన్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

ఇవీ చదవండి..

ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్​కు అస్వస్థత
కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బోడె ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పగలంతా కంకిపాడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సాయంత్రం ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తాడిగడపలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన డీహైడ్రేషన్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

ఇవీ చదవండి..

ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.