ETV Bharat / state

కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

author img

By

Published : Feb 9, 2021, 10:59 AM IST

కృష్ణాజిల్లాలో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటేసేందుకు ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరారు.

కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు
కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు

కృష్ణాజిల్లాలో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాలోని జగ్యయ్యపేట, నందిగామ, మైలవరం, పెనమూలురు, కంకిపాడు నియోజకవర్గాల పరిధిలోని 14 మండలల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 234 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉండగా 23 చోట్ల ఏకగ్రీవం కావడంతో 211పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

తొలి దశలో పెనుగంచిప్రోలు, చందర్లపాడు, కంచికచర్ల, మైలవరం, గుంటుపల్లి, నున్న, రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు పంచాయతీలు ఉన్నాయి. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో మొత్తం 33పంచాయితీలకు, 270వార్డులకు పోరు నెలకొంది. పెనమలూరు మండల పరిధిలో ఆరు గ్రామాలకు, కంకిపాడు పరిధిలో 17గ్రామాలకు, విజయవాడ గ్రామీణం పరిధిలో 10గ్రామాలకు పోలింగ్ జరగనుంది.

అయితే పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 545మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 2447పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2502వార్డులు ఉండగా... వీటిల్లో 392ఏకగ్రీవం కావటంతో 2110వార్డుల్లో ఎన్నిక జరుగుతుంది. 4533మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు.

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో కొవిడ్ నిబంధనలతో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రామవరప్పాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వద్ద పోలీంగ్ కేంద్రాన్ని డీసీపీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు.

పెనమలూరులో...

పెనమలూరు నియోజకవర్గంలోపోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. కంకిపాడు జడ్పీ పాఠశాలలోని 8 పోలింగ్ బూతుల్లో సరైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రధానంగా ఓటు వేసేందుకు వచ్చిన ఓటరుకు తాము ఎక్కడ ఓటు వేయాలని సమాచారం తెలియకుండా ఉంది. కొవిడ్ నిబంధనల ప్రకారం ఓటర్లు భౌతిక దూరం పాటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

విజయవాడ గ్రామీణం: నున్న, అంబాపురం, నైనవరం, పాతపాడు, కొత్తూరు, తాడేపల్లి గ్రామాలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రెండు గంటల్లోనే 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నున్న గ్రామంలోని 7 పోలింగ్ స్టేషన్​లకు సామాగ్రితో రెండు బస్సులలో సిబ్బంది చేరుకున్నారు.

విజయవాడ డివిజన్​లోని 14 మండలాల్లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఉదయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ పర్యవేక్షిస్తున్నారు.

నందిగామలో.....

నందిగామ నియోజకవర్గంలోని 72 పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఓటు వేసేందుకు అన్ని గ్రామాల్లో ఓటర్ల తరలివస్తున్నారు .నియోజకవర్గంలోని లక్షా 60 వేల మూడు వందల పదిహేను మంది పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నందిగామ మండలంలోని చందాపురం, ముప్పాళ్ల ,అంబర్ పేట, అయితవరం తోపాటు చందర్లపాడు , కంచికచర్ల మండలం లో కంచికచర్ల ,పరిటాల మండలంలో వీరులపాడు, జుజ్జూరు, పెండ్యాల తదితర గ్రామాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.

మైలవరంలో....

కృష్ణా జిల్లా మైలవరం పంచాయతీ తొలి విడత ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.స్థానిక హానిమిరెడ్డి ప్రభుత్వ పాఠశాల , ఎస్వీఆర్ జి పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​ల వద్ద ఉదయం నుంచి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు సైతం ఓటు వేసేందుకు రావడంతో వారికి ప్రత్యేక ఏర్పాట్లను చేసి ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

కృష్ణాజిల్లాలో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాలోని జగ్యయ్యపేట, నందిగామ, మైలవరం, పెనమూలురు, కంకిపాడు నియోజకవర్గాల పరిధిలోని 14 మండలల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 234 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉండగా 23 చోట్ల ఏకగ్రీవం కావడంతో 211పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

తొలి దశలో పెనుగంచిప్రోలు, చందర్లపాడు, కంచికచర్ల, మైలవరం, గుంటుపల్లి, నున్న, రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు పంచాయతీలు ఉన్నాయి. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో మొత్తం 33పంచాయితీలకు, 270వార్డులకు పోరు నెలకొంది. పెనమలూరు మండల పరిధిలో ఆరు గ్రామాలకు, కంకిపాడు పరిధిలో 17గ్రామాలకు, విజయవాడ గ్రామీణం పరిధిలో 10గ్రామాలకు పోలింగ్ జరగనుంది.

అయితే పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 545మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 2447పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2502వార్డులు ఉండగా... వీటిల్లో 392ఏకగ్రీవం కావటంతో 2110వార్డుల్లో ఎన్నిక జరుగుతుంది. 4533మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు.

విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో కొవిడ్ నిబంధనలతో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రామవరప్పాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వద్ద పోలీంగ్ కేంద్రాన్ని డీసీపీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు.

పెనమలూరులో...

పెనమలూరు నియోజకవర్గంలోపోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. కంకిపాడు జడ్పీ పాఠశాలలోని 8 పోలింగ్ బూతుల్లో సరైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రధానంగా ఓటు వేసేందుకు వచ్చిన ఓటరుకు తాము ఎక్కడ ఓటు వేయాలని సమాచారం తెలియకుండా ఉంది. కొవిడ్ నిబంధనల ప్రకారం ఓటర్లు భౌతిక దూరం పాటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

విజయవాడ గ్రామీణం: నున్న, అంబాపురం, నైనవరం, పాతపాడు, కొత్తూరు, తాడేపల్లి గ్రామాలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రెండు గంటల్లోనే 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నున్న గ్రామంలోని 7 పోలింగ్ స్టేషన్​లకు సామాగ్రితో రెండు బస్సులలో సిబ్బంది చేరుకున్నారు.

విజయవాడ డివిజన్​లోని 14 మండలాల్లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఉదయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ పర్యవేక్షిస్తున్నారు.

నందిగామలో.....

నందిగామ నియోజకవర్గంలోని 72 పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఓటు వేసేందుకు అన్ని గ్రామాల్లో ఓటర్ల తరలివస్తున్నారు .నియోజకవర్గంలోని లక్షా 60 వేల మూడు వందల పదిహేను మంది పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నందిగామ మండలంలోని చందాపురం, ముప్పాళ్ల ,అంబర్ పేట, అయితవరం తోపాటు చందర్లపాడు , కంచికచర్ల మండలం లో కంచికచర్ల ,పరిటాల మండలంలో వీరులపాడు, జుజ్జూరు, పెండ్యాల తదితర గ్రామాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.

మైలవరంలో....

కృష్ణా జిల్లా మైలవరం పంచాయతీ తొలి విడత ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.స్థానిక హానిమిరెడ్డి ప్రభుత్వ పాఠశాల , ఎస్వీఆర్ జి పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​ల వద్ద ఉదయం నుంచి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు సైతం ఓటు వేసేందుకు రావడంతో వారికి ప్రత్యేక ఏర్పాట్లను చేసి ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.