కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలంలోని ఐలూరుకు చెందిన రామయ్య అనే వృద్ధుడు కృష్ణా నది పడి మృతిచెందాడు. పశువులను మేపడానికి కృష్ణా నదీపాయలోకి వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నదిలో జారి గల్లంతయ్యాడు. సాయంత్రానికి జీవాలు ఇంటికి వచ్చినప్పటికీ.. రామయ్య రాకపోవడంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నదిలో గాలింపు చర్యలు చేపట్టగా రామయ్య మృతదేహాం లభ్యమైంది.
ఇదీచదవండి.: పాస్ చేస్తారా.. పరీక్ష పెడతారా..?