కృష్ణానది వరద ధాటికి విజయవాడలో కొన్ని కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వరద బాధితులకు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పునరావాసం కల్పించారు. ఏదో కార్యక్రమం ఉందంటూ ఉన్నట్లుండి వారిని ఖాళీ చేయమన్నారు. సామాన్లు తీసుకుని వెళ్లడం కష్టమని బాధితులు వాపోయారు. పోలీసులు వారిని మరోచోటకు తరలించారు. సామగ్రి పరిస్థితి ఏంటని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఒకచోట.. వారి వస్తువులు మరో చోట ఉన్నాయి
ఇదీ చదవండి: