ETV Bharat / state

మహానేతకు మహానాడు వేదికగా ఘన నివాళి

author img

By

Published : May 28, 2020, 5:48 AM IST

తెలుగునాట అన్నా అనే పదం ఆయన్ను చూసే పుట్టిందని భావిస్తారంతా. అశేష ఆంధ్రావనికి ఆ పేరే తారకమంత్రం. సీనీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్ర సృష్టించిన యుగపురుషుడు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర రాజకీయాల్లో నందమూరి తారకరామారావుది ఒక శకం. ఆయన ప్రవేశం ఉమ్మడి రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఆ మహానేత 97వ జయంతి సందర్భంగా యుగపురుషుడికి నివాళి పేరిట… తెలుగుదేశం పార్టీ ఘన నివాళులర్పించనుంది.

నందమూరి తారకరామారావు
నందమూరి తారకరామారావు

నందమూరి తారకరామారావు… తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరది. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత. తెలుగు నాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే ఎన్టీఆర్ పేరు మొదట వినిపిస్తుంది. కాలే కడుపులకు పట్టేడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకనే ఆలోచించిన వాస్తవిక వాది. అందుకే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారు. జనమే ఊపిరిగా రాజకీయం చేశారు. తెలుగుదేశం పార్టీని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు.

రాజకీయాల్లోకి వచ్చి పార్టీ ప్రారంభించిన 13నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా రెండు రూపాయాలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు, ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింప చేసి… ఆ ఘనత పోందిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్​ది ఒక శకం. అయన ప్రవేశం రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఈ చైతన్యాన్ని నమ్ముకునే ఆయన తన రాజకీయ జీవితం చివరి వరకూ ధైర్యంగా నడవగలిగారు.

అందుకే ఆయన పదమూడు ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. మూడుసార్లు విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్​కు ప్రజలపాలనే తప్ప ఎమ్మెల్యేల పాలన తెలియదు. కనుకే ప్రజా సేవకుడిగా నిలిచారు. ఇక సినీరంగంలో ఎన్టీఆర్ ఓ నట విశ్వరూపం. తెలుగు లోగిళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి రాష్ట్రప్రజల్లో చెరగని ముద్రవేశారు. నాలుగున్నర దశాబ్ధాల పాటు వెండితెర రారాజుగా నిలిచి 296 చిత్రాలలో నటించారు. ఆ మహానేతకు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఘన నివాళులర్పించనుంది.

నందమూరి తారకరామారావు… తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరది. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత. తెలుగు నాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే ఎన్టీఆర్ పేరు మొదట వినిపిస్తుంది. కాలే కడుపులకు పట్టేడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకనే ఆలోచించిన వాస్తవిక వాది. అందుకే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారు. జనమే ఊపిరిగా రాజకీయం చేశారు. తెలుగుదేశం పార్టీని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు.

రాజకీయాల్లోకి వచ్చి పార్టీ ప్రారంభించిన 13నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా రెండు రూపాయాలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు, ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింప చేసి… ఆ ఘనత పోందిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్​ది ఒక శకం. అయన ప్రవేశం రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఈ చైతన్యాన్ని నమ్ముకునే ఆయన తన రాజకీయ జీవితం చివరి వరకూ ధైర్యంగా నడవగలిగారు.

అందుకే ఆయన పదమూడు ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. మూడుసార్లు విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్​కు ప్రజలపాలనే తప్ప ఎమ్మెల్యేల పాలన తెలియదు. కనుకే ప్రజా సేవకుడిగా నిలిచారు. ఇక సినీరంగంలో ఎన్టీఆర్ ఓ నట విశ్వరూపం. తెలుగు లోగిళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి రాష్ట్రప్రజల్లో చెరగని ముద్రవేశారు. నాలుగున్నర దశాబ్ధాల పాటు వెండితెర రారాజుగా నిలిచి 296 చిత్రాలలో నటించారు. ఆ మహానేతకు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఘన నివాళులర్పించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.