ETV Bharat / state

మాస్కులపై ఏదీ దారి..?

author img

By

Published : May 18, 2020, 7:30 PM IST

మాస్కల తయారీ నిలిచిపోయింది. ప్రభుత్వం అందించే వస్త్రం సకాలంలో జిల్లాకు అందడం లేదు. దీంతో కృష్ణా జిల్లాలో మాస్కుల తయారీ నిలిచిపోయింది. నిల్వలు లేక ఆప్కో చేతులెత్తేసింది. ప్రత్యామ్నాయం అన్వేషణలో జిల్లా యంత్రాంగం పరుగులు తీస్తోంది.

no mask
no mask

మాస్కుల తయారీకి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడే మాస్కుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సకాలంలో వస్త్రం జిల్లాకు రాకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు కృష్ణా జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. మాస్కులకు అవసరమైన వస్త్రం సరఫరా కాంట్రాక్టును ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. కొన్నాళ్లు సవ్యంగానే సాగిన సరఫరా ఆ తర్వాత ఆలస్యం కావడం ప్రారంభమైంది. గత పది రోజుల నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. చేనేత సంఘాల నుంచి సేకరించే పరిస్థితి లేకపోవడం, ఇప్పటివరకు గోదాముల్లో ఉన్న నిల్వలు అయిపోవడంతో ఆప్కో చేతులెత్తేసింది. ఫలితంగా మాస్కుల తయారీకి బ్రేక్‌ పడింది.

ఈ పరిస్థితిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జాప్యాన్ని నివారించేందుకు స్థానికంగా వస్త్రాన్ని సేకరించే అవకాశం ఉంటే పరిశీలించమని కలెక్టర్‌ ఇంతియాజ్‌కు మంత్రి సూచించారు. దీనిపై అధికారులు పరిశీలించారు. విజయవాడలోని హోల్‌సేల్‌ వ్యాపారులను పిలిపించి మాట్లాడారు. స్థానికంగా కొనుగోలు చేయడానికి, ఉన్న బడ్జెట్‌లో కొంతవరకు వాడుకోవడానికి సంబంధించి ప్రతిపాదనలను తయారుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి సూచన ప్రకారం ప్రభుత్వానికి పంపించారు.

జిల్లాలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున మొత్తం 1.27 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. ఇప్పటివరకు లక్ష్యంలో 40 శాతమే పూర్తి అయింది. ప్రస్తుతానికి జిల్లాలో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలోనే పంపిణీ చేశారు. గ్రీన్‌ జోన్లలో పంపిణీ ఆగిపోయింది. ఇంకా దాదాపు 8.5 లక్షల మీటర్ల మేర వస్త్రం అవసరం ఉంది. ఆప్కో నుంచి వచ్చిన దాంట్లో పాత నిల్వలు ఉండడం, అవి కూడా చిన్న చిన్న ముక్కలు కావడంతో కుట్టేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. దీనిపై డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావును ‘ఈనాడు’ వివరణ కోరింది. జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అక్కడి నుంచి వచ్చిన దాని ప్రకారం తాము నడుచుకుంటామని వివరించారు. వీలైనంత త్వరగా మాస్కులు కుట్టి పంపిణీ చేసే లక్ష్యంతో సాగుతున్నామన్నారు.

మాస్కుల తయారీకి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడే మాస్కుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సకాలంలో వస్త్రం జిల్లాకు రాకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు కృష్ణా జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. మాస్కులకు అవసరమైన వస్త్రం సరఫరా కాంట్రాక్టును ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. కొన్నాళ్లు సవ్యంగానే సాగిన సరఫరా ఆ తర్వాత ఆలస్యం కావడం ప్రారంభమైంది. గత పది రోజుల నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. చేనేత సంఘాల నుంచి సేకరించే పరిస్థితి లేకపోవడం, ఇప్పటివరకు గోదాముల్లో ఉన్న నిల్వలు అయిపోవడంతో ఆప్కో చేతులెత్తేసింది. ఫలితంగా మాస్కుల తయారీకి బ్రేక్‌ పడింది.

ఈ పరిస్థితిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జాప్యాన్ని నివారించేందుకు స్థానికంగా వస్త్రాన్ని సేకరించే అవకాశం ఉంటే పరిశీలించమని కలెక్టర్‌ ఇంతియాజ్‌కు మంత్రి సూచించారు. దీనిపై అధికారులు పరిశీలించారు. విజయవాడలోని హోల్‌సేల్‌ వ్యాపారులను పిలిపించి మాట్లాడారు. స్థానికంగా కొనుగోలు చేయడానికి, ఉన్న బడ్జెట్‌లో కొంతవరకు వాడుకోవడానికి సంబంధించి ప్రతిపాదనలను తయారుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి సూచన ప్రకారం ప్రభుత్వానికి పంపించారు.

జిల్లాలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున మొత్తం 1.27 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. ఇప్పటివరకు లక్ష్యంలో 40 శాతమే పూర్తి అయింది. ప్రస్తుతానికి జిల్లాలో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలోనే పంపిణీ చేశారు. గ్రీన్‌ జోన్లలో పంపిణీ ఆగిపోయింది. ఇంకా దాదాపు 8.5 లక్షల మీటర్ల మేర వస్త్రం అవసరం ఉంది. ఆప్కో నుంచి వచ్చిన దాంట్లో పాత నిల్వలు ఉండడం, అవి కూడా చిన్న చిన్న ముక్కలు కావడంతో కుట్టేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. దీనిపై డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావును ‘ఈనాడు’ వివరణ కోరింది. జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అక్కడి నుంచి వచ్చిన దాని ప్రకారం తాము నడుచుకుంటామని వివరించారు. వీలైనంత త్వరగా మాస్కులు కుట్టి పంపిణీ చేసే లక్ష్యంతో సాగుతున్నామన్నారు.

ఇదీ చదవండి:

భారీ పతనం దిశగా మార్కెట్లు- సెన్సెక్స్ 900 మైనస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.