శ్రీమతి అమరావతి 2019 గ్రాండ్ ఫైనల్ వేడుకలు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సందడిగా జరిగాయి. 30 మంది మహిళలు తుది పోటీల్లో పోటీపడగా విజయవాడ పడమటకు చెందిన మల్లిక టైటిల్ ను కైవసం చేసుకున్నారు. షకీరా , భావనలు మొదటి, రెండో రన్నరప్లుగా నిలిచారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సినీ నటుడు బాబు మోహన్, కథానాయిక ప్రేమ, భాజపా నాయకుడు అంబికా కృష్ణ , మెసేజ్ హైదరాబాద్ స్నేహ చౌదరి లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
ఇదీచూడండి.సీఎం దిల్లీ పర్యటనపై రాద్దాంతం సరికాదు: మంత్రి అనిల్