ETV Bharat / state

'ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయండి.. వయోపరిమితి పెంచండి' - the Indian Democratic Conference meeting news

కొవిడ్ నిబంధనలకు లోబడి కోచింగ్ సెంటర్ లో రీ-ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. పోలీసు శాఖలో ఖాళీలన్నింటికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆయన ఎపీపీఎస్సీ పరీక్షలన్నీ తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు భారత ప్రజాతంత్ర ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

MLC Lakshmana Rao
భారత ప్రజాతంత్ర సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
author img

By

Published : Nov 5, 2020, 5:39 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి ఏడాది ఉద్యోగాల ఖాళీలను జనవరిలో క్యాలండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి రెండు జనవరులు ముగిశాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో భారత ప్రజాతంత్ర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది నవంబర్ 22న ఏపీపీఎస్సీ ఓపెన్ హౌస్ నిర్వహించి, 2020 జనవరి నుంచి వార్షిక క్యాలండర్ ప్రకటించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన మాటలు చేతల రూపంలో ఆచరణలోకి రాలేదని మండి పడ్డారు. వార్షిక క్యాలెండర్ ను ప్రకటించి, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి ఏడాది ఉద్యోగాల ఖాళీలను జనవరిలో క్యాలండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి రెండు జనవరులు ముగిశాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో భారత ప్రజాతంత్ర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది నవంబర్ 22న ఏపీపీఎస్సీ ఓపెన్ హౌస్ నిర్వహించి, 2020 జనవరి నుంచి వార్షిక క్యాలండర్ ప్రకటించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన మాటలు చేతల రూపంలో ఆచరణలోకి రాలేదని మండి పడ్డారు. వార్షిక క్యాలెండర్ ను ప్రకటించి, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కోరారు.

ఇవీ చూడండి...

వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.