ETV Bharat / state

'ఎమ్మెల్యే పార్ధసారధిని 15 రోజులు క్వారంటైన్​కి పంపాలి'

author img

By

Published : May 4, 2020, 9:37 PM IST

రెడ్​జోన్లో ఉన్న విజయవాడ నుంచి గ్రీన్​జోన్ ఉయ్యూరుకు వచ్చి తిరుగుతున్న ఎమ్మెల్యే పార్ధసారధిని వదిలి.. తనపై కేసులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆకలితో అల్లాడుతున్న పేదలకు సహాయం చెయ్యడమే తాను చేసిన నేరమా అని నిలదీశారు.

mlc pardhasaradhi
mlc pardhasaradhi

లాక్​డౌన్ నిబంధనల ప్రకారం రెడ్​జోన్ నుంచి గ్రీన్​జోన్ ఉయ్యూరు వచ్చిన ఎమ్మెల్యే పార్ధసారధిని 15 రోజులు క్వారంటైన్​కి పంపాలని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. తనతో పాటు తెదేపా నేతలపై నిన్న రాత్రి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పోలీసుల అక్రమ కేసులకు భయపడేది లేదని.. నిరంతరం ప్రజాసేవ చేస్తూనే ఉంటామన్నారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే 100 మంది వైకాపా కార్యకర్తలతో ఉయ్యూరులో రోజూ తిరుగుతూ ప్రచారం చేస్తుంటే.. అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు.

ఇవీ చదవండి:

లాక్​డౌన్ నిబంధనల ప్రకారం రెడ్​జోన్ నుంచి గ్రీన్​జోన్ ఉయ్యూరు వచ్చిన ఎమ్మెల్యే పార్ధసారధిని 15 రోజులు క్వారంటైన్​కి పంపాలని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. తనతో పాటు తెదేపా నేతలపై నిన్న రాత్రి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పోలీసుల అక్రమ కేసులకు భయపడేది లేదని.. నిరంతరం ప్రజాసేవ చేస్తూనే ఉంటామన్నారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే 100 మంది వైకాపా కార్యకర్తలతో ఉయ్యూరులో రోజూ తిరుగుతూ ప్రచారం చేస్తుంటే.. అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు.

ఇవీ చదవండి:

'ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.