కృష్ణా జిల్లా మొవ్వలో కోర్టు నూతన భవనాల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ స్థలాలను పరిశీలించారు. మొవ్వ గ్రామంలో ఏర్పాటు చేసిన కోర్టు.. ఇప్పటివరకు అద్దె భవనంలో ఉండటంతో మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి ప్రాంత కక్ష్యదారుల సౌకర్యార్థం సొంత భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు. మొవ్వ ఫైర్ స్టేషన్ వద్ద గల స్థలం, ప్రధాన రహదారి వెంట ఉన్న స్థలాలను పరిశీలించి.. వాటిపై ఉన్న కోర్టు కేసులను త్వరగా తొలగించే ప్రయత్నం చేయాలని తహసీల్దార్కు సూచించారు.
ఇదీ చదవండి: CPI Narayana: 'తెలంగాణలో బంగాల్ తరహా రాజకీయ పరిణామాలు జరిగే ప్రమాదం ఉంది'