కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెం, అవనిగడ్డ మండలంలోని ఎడలంక నుంచి అక్రమంగా నత్తగుల్లలను మహారాష్ట్ర తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్నారు. ఎడలంక గ్రామనికి చెందిన కోప్పనాతి లంకేశ్వరరావుతో... ముంబయికి చెందిన మరో నలుగురు కలిసి... నత్తగుల్లలను మహారాష్ట్రకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవనిగడ్డ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయపూడి వేణుగోపాలరావు ఇచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 3 టన్నుల నత్తగుల్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి : 9వ రోజు ధర్నా ... సీఎం స్పందన సున్నా