ఇసుక రీచ్ల్లో పనిచేసే కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడ ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో 70 రోజులుగా ఇసుక కొరతతో వేలాది కార్మికులకు ఉపాధి కరువైందని, ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు-లారీలు ఇంటికే పరిమితమైయ్యాయని సంఘం ఆరోపించింది. ప్రభుత్వ చర్యలతో లారీ డ్రైవర్లకు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి దాపురించిందని అసోసియేషన్ కార్యదర్శి సదాశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. పుండుమీద కారం మాదిరి వాహనాలకు ఫైనాన్స్, పన్నులు, ఇన్సూరెన్స్లు కట్టలేని పరిస్థితికి చేరుకున్నామని ఆక్రోశం వెలిబుచ్చారు. తక్షణమే ఇసుక రీచ్లను పెంచి లారీలు-ట్రాక్టర్లకు అనుమతులిచ్చి వేలాది కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు'