ETV Bharat / state

Krishna Delta Canals: గుర్రపుడెక్క.. చెత్త చెదారం.. నాలుగేళ్లుగా అదే తీరు

Krishna Delta Canals: ప్రయాణం సాఫీగా సాగాలంటే రోడ్డు చక్కగా ఉండాలి.. సాగు సాఫీగా సాగాలంటే కాలువలు శుభ్రంగా ఉండాలి.. సీఎం వస్తుంటే.. అడ్డుగాలేని చెట్లనూ అడ్డంగా నరికేయించే ప్రభుత్వం పంట కాలువల్లో పెరిగిన పిచ్చిచెట్లను మాత్రం పట్టించుకోవడం లేదు. సీజన్‌కు ముందే.. నిర్వహణ చేయాల్సిన సర్కార్‌.. సీజన్‌ ప్రారంభమవుతున్నా మేల్కోలేదు. ఒకట్రెండు కాదు.. నాలుగేళ్లుగా ఇదే తంతు. కాలువల పూడిక తీసిన పాపాన పోలేదు. అల్లుకున్న గుర్రపుడెక్క, పేరుకున్న చెత్త చెదారం, నెర్రలిచ్చిన కాలువగట్లు, తుప్పుపట్టిన గేట్లు.. ఇలా కృష్ణాడెల్టా సాగునీటి కాలువల వ్యవస్థ.. అస్తవ్యస్తంగా తయారైంది.

author img

By

Published : Jun 23, 2023, 5:10 PM IST

Krishna Delta Canals
కృష్ణా డెల్టా కాలువలు

Negligence on Krishna Delta Canals: వేల ఎకరాల సాగుకు ఆధారమైన పంటకాల్వ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పాలిథీన్‌ సంచులు, పిల‌్లల డైపర్లు.. ఇలా ఒకటేంటి.. ఇదో డంపింగ్‌ యార్డులా తయారైంది. కనుచూపు మేరలో గుర్రపుడెక్క పేరుకుపోయింది. పోనీ.. కాలువ గట్లైనా చక్కగా ఉన్నాయా అంటే అదీలేదు. ఏపుగా పెరిగిన కంపచెట్లతో అస్తవ్యస్థంగా తయారయ్యాయి. మొత్తంగా ఇవి పంట కాల్వలని కొత్త వ్యక్తులు కనిపెట్టలేని దుస్థితికి చేరాయి. కొన్నేళ్లుగా.. పూడిక తీయించక.. కాల్వలు ఇలా రూపురేఖలు కోల్పోతున్నాయి. ప్రధాన కాలువలే ఇలా ఉంటే.. ఇక డిస్ట్రిబ్యూటరీ కాలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చాలాచోట్ల గట్లు తెగిపోయాయి.

కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల పరిస్థితి: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని.. గుంటూరు ఛానల్, కుడిగట్టు, తూర్పు, పశ్చిమ, నిజాంపట్నం, హైలెవల్ , కొమ్మూరు కాలువల కింద.. 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. గుంటూరు ఛానల్, కొమ్మమూరు కాలువలపై.. లాకుల గురించి అధికారులు.. ఎప్పుడో మర్చిపోయారు. వాళ్లకే గుర్తుండి ఉండే.. వాటిని తాళ్లతో కట్టేయాల్సిన అవసరం ఏముంటుంది?

ఎప్పుడైనా ఇటువైపు వచ్చి ఉంటే ఈ తలుపులు ఎప్పుడు విరిగాయో తెలిసేవి. వాటి లాకులు ఇప్పుడు తిప్పినా తిరగవు. పూర్తిగా.. స్ట్రక్‌ అయిపోయాయి. నీరు పోకుండా ఉండేందుకు ఏవో కర్రలు అడ్డంపెట్టి కట్టేశారు. మళ్లీ వాటిని తొలగించి కొత్త గేట్ పెట్టాలనే సంగతే మర్చిపోయినట్లున్నారు. గతంలో.. కొమ్మమూరు కాలువ ఆధునీకరణ 410 కోట్లతో చేపట్టినా ప్రస్తుతం ఆ పనులూ.. ఆర్ధాంతరంగా ఆపేశారు. బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి.

కృష్ణా తూర్పు డెల్టా కాలువల పరిస్థితి: ఇక కృష్ణా తూర్పు డెల్టా కాల్వల పరిస్థితీ పశ్చిమ డెల్టాకు భిన్నమేమీ కాదు. కృష్ణా తూర్పు డెల్టాలోని ఏలూరు, బందరు, రైవస్, బంటుమిల్లి, కాంప్ బెల్ లాంటి 9 ప్రధాన కాలువల పరిధిలో 7.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టు పరిరక్షించాలన్న ధ్యాసే ప్రభుత్వానికి లేదు. ఏ కాలువ చూసినా తూటి కాడలు.. పిచ్చిచెట్లు, గుర్రపు డెక్కే కనిపిస్తోంది.

కృష్ణా జిల్లా పెనమలూరు, కంకిపాడు, కొలవెన్ను, పునాదిపాడు, ప్రొద్దుటూరు, పామర్రు నియోజకవర్గంలోని కొమరవోలు డ్రెయిన్లో జమ్ము, తూడు దట్టంగా అల్లుకుని అధ్వానంగా తయారైంది. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం,అవనిగడ్డ తదితర ప్రాంతాలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే ప్రధాన కాలువలదీ అదే దుస్థితి. ముందే నీళ్లు విడుదల చేశామని.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. అవి సాఫీగా చేలకు చేరే పరిస్థితి లేదు.

గడచిన నాలుగేళ్లుగా.. ప్రభుత్వం కృష్ణా డెల్టా కాలువల పూడిక తీసి, గట్లు పటిష్టం చేసిన పాపానపోలేదు. రైతులే చాలాచోట్ల సొంతంగా నిధులు సమకూర్చుకుని.. కాలువల్ని బాగుచేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరమ్మతుల.. ప్రణాళికలు కాగితాలకే పరిమితం అయ్యాయి. గుత్తేదారులు ముందుకు రావడం లేదంటున్నారని.. రైతులు చెప్తున్నారు.

ఇలాంటి అస్తవ్యస్థ పంటకాలువల నిర్వహణ.. ప్రకాశం బ్యారేజీ దిగువన సాగయ్యే 13.2 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రశ్నార్థకంగా చేస్తోంది. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాల్లోని.. 16 ప్రధాన కాలువలున్నాయి. వాటిని ఆనుకుని.. వేల కిలోమీటర్ల పొడవైన డిస్ట్రిబ్యూటరీలు న్నాయి. మొత్తంగా ఏటా 181 టీఎంసీల నీరు వీటి గుండానే వెళ్లాలి. అలాంటి వ్యవస్థను ప్రభుత్వం నిట్టనిలువునా నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో ఉన్న సాగునీటి సంఘాల వ్యవస్థను అటకెక్కించడమే ప్రస్తుత దుస్థితికి కారణమనే విమర్శలున్నాయి.

కంకిపాడు ప్రాంతంలో ఎక్కువగా నివాస స్థలాలకు వెంచర్లు వేస్తుండంతో.. పంటపొలాలకు వెళ్లే రహదారులు, కాలువలు ధ్వంసం అవుతున్నాయి. అనధికార కల్వర్టులతో.. కాలువలు పూడిపోతున్నాయి. కాల్వలు బాగు చేయకపోయినా.. కనీసం జంగిల్ క్లీయరెన్స్ ఇచ్చినా మేలేనని రైతులు కోరుతున్నారు.

"కాలువలు సరిగ్గా లేవు. ఎక్కడివి అక్కడ పోయాయి. నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. గట్టిగా అడగడం కూడా చేయలేకపోతున్నాం. అలా అడుగుతూ ఉంటే.. ఇవి తీసేస్తాం.. అవి తీసేస్తాం అని అంటున్నారు". - రైతు

"నాలుగు సంవత్సరాలుగా నీళ్లు సరిగ్గా రావడం లేదు. వచ్చినా మధ్యలోనే ఆగిపోతున్నాయి. కాలువలో నీళ్లు తీసుకునే పరిస్థితి లేకుండా పోతుంది". - రైతు

Negligence on Krishna Delta Canals: వేల ఎకరాల సాగుకు ఆధారమైన పంటకాల్వ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పాలిథీన్‌ సంచులు, పిల‌్లల డైపర్లు.. ఇలా ఒకటేంటి.. ఇదో డంపింగ్‌ యార్డులా తయారైంది. కనుచూపు మేరలో గుర్రపుడెక్క పేరుకుపోయింది. పోనీ.. కాలువ గట్లైనా చక్కగా ఉన్నాయా అంటే అదీలేదు. ఏపుగా పెరిగిన కంపచెట్లతో అస్తవ్యస్థంగా తయారయ్యాయి. మొత్తంగా ఇవి పంట కాల్వలని కొత్త వ్యక్తులు కనిపెట్టలేని దుస్థితికి చేరాయి. కొన్నేళ్లుగా.. పూడిక తీయించక.. కాల్వలు ఇలా రూపురేఖలు కోల్పోతున్నాయి. ప్రధాన కాలువలే ఇలా ఉంటే.. ఇక డిస్ట్రిబ్యూటరీ కాలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చాలాచోట్ల గట్లు తెగిపోయాయి.

కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల పరిస్థితి: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని.. గుంటూరు ఛానల్, కుడిగట్టు, తూర్పు, పశ్చిమ, నిజాంపట్నం, హైలెవల్ , కొమ్మూరు కాలువల కింద.. 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. గుంటూరు ఛానల్, కొమ్మమూరు కాలువలపై.. లాకుల గురించి అధికారులు.. ఎప్పుడో మర్చిపోయారు. వాళ్లకే గుర్తుండి ఉండే.. వాటిని తాళ్లతో కట్టేయాల్సిన అవసరం ఏముంటుంది?

ఎప్పుడైనా ఇటువైపు వచ్చి ఉంటే ఈ తలుపులు ఎప్పుడు విరిగాయో తెలిసేవి. వాటి లాకులు ఇప్పుడు తిప్పినా తిరగవు. పూర్తిగా.. స్ట్రక్‌ అయిపోయాయి. నీరు పోకుండా ఉండేందుకు ఏవో కర్రలు అడ్డంపెట్టి కట్టేశారు. మళ్లీ వాటిని తొలగించి కొత్త గేట్ పెట్టాలనే సంగతే మర్చిపోయినట్లున్నారు. గతంలో.. కొమ్మమూరు కాలువ ఆధునీకరణ 410 కోట్లతో చేపట్టినా ప్రస్తుతం ఆ పనులూ.. ఆర్ధాంతరంగా ఆపేశారు. బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి.

కృష్ణా తూర్పు డెల్టా కాలువల పరిస్థితి: ఇక కృష్ణా తూర్పు డెల్టా కాల్వల పరిస్థితీ పశ్చిమ డెల్టాకు భిన్నమేమీ కాదు. కృష్ణా తూర్పు డెల్టాలోని ఏలూరు, బందరు, రైవస్, బంటుమిల్లి, కాంప్ బెల్ లాంటి 9 ప్రధాన కాలువల పరిధిలో 7.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టు పరిరక్షించాలన్న ధ్యాసే ప్రభుత్వానికి లేదు. ఏ కాలువ చూసినా తూటి కాడలు.. పిచ్చిచెట్లు, గుర్రపు డెక్కే కనిపిస్తోంది.

కృష్ణా జిల్లా పెనమలూరు, కంకిపాడు, కొలవెన్ను, పునాదిపాడు, ప్రొద్దుటూరు, పామర్రు నియోజకవర్గంలోని కొమరవోలు డ్రెయిన్లో జమ్ము, తూడు దట్టంగా అల్లుకుని అధ్వానంగా తయారైంది. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం,అవనిగడ్డ తదితర ప్రాంతాలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే ప్రధాన కాలువలదీ అదే దుస్థితి. ముందే నీళ్లు విడుదల చేశామని.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. అవి సాఫీగా చేలకు చేరే పరిస్థితి లేదు.

గడచిన నాలుగేళ్లుగా.. ప్రభుత్వం కృష్ణా డెల్టా కాలువల పూడిక తీసి, గట్లు పటిష్టం చేసిన పాపానపోలేదు. రైతులే చాలాచోట్ల సొంతంగా నిధులు సమకూర్చుకుని.. కాలువల్ని బాగుచేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరమ్మతుల.. ప్రణాళికలు కాగితాలకే పరిమితం అయ్యాయి. గుత్తేదారులు ముందుకు రావడం లేదంటున్నారని.. రైతులు చెప్తున్నారు.

ఇలాంటి అస్తవ్యస్థ పంటకాలువల నిర్వహణ.. ప్రకాశం బ్యారేజీ దిగువన సాగయ్యే 13.2 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రశ్నార్థకంగా చేస్తోంది. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాల్లోని.. 16 ప్రధాన కాలువలున్నాయి. వాటిని ఆనుకుని.. వేల కిలోమీటర్ల పొడవైన డిస్ట్రిబ్యూటరీలు న్నాయి. మొత్తంగా ఏటా 181 టీఎంసీల నీరు వీటి గుండానే వెళ్లాలి. అలాంటి వ్యవస్థను ప్రభుత్వం నిట్టనిలువునా నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో ఉన్న సాగునీటి సంఘాల వ్యవస్థను అటకెక్కించడమే ప్రస్తుత దుస్థితికి కారణమనే విమర్శలున్నాయి.

కంకిపాడు ప్రాంతంలో ఎక్కువగా నివాస స్థలాలకు వెంచర్లు వేస్తుండంతో.. పంటపొలాలకు వెళ్లే రహదారులు, కాలువలు ధ్వంసం అవుతున్నాయి. అనధికార కల్వర్టులతో.. కాలువలు పూడిపోతున్నాయి. కాల్వలు బాగు చేయకపోయినా.. కనీసం జంగిల్ క్లీయరెన్స్ ఇచ్చినా మేలేనని రైతులు కోరుతున్నారు.

"కాలువలు సరిగ్గా లేవు. ఎక్కడివి అక్కడ పోయాయి. నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. గట్టిగా అడగడం కూడా చేయలేకపోతున్నాం. అలా అడుగుతూ ఉంటే.. ఇవి తీసేస్తాం.. అవి తీసేస్తాం అని అంటున్నారు". - రైతు

"నాలుగు సంవత్సరాలుగా నీళ్లు సరిగ్గా రావడం లేదు. వచ్చినా మధ్యలోనే ఆగిపోతున్నాయి. కాలువలో నీళ్లు తీసుకునే పరిస్థితి లేకుండా పోతుంది". - రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.