ETV Bharat / state

భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట... దుర్గమ్మ సేవలో ప్రముఖులు - ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న..డీజీపీ, కన్నా లక్ష్మీనారాయణ

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు బారులు తీరుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న..డీజీపీ, కన్నా లక్ష్మీనారాయణ
author img

By

Published : Oct 8, 2019, 9:45 AM IST

Updated : Oct 8, 2019, 11:49 AM IST

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న..డీజీపీ, మంత్రులు, భాజపా రాష్ట్రాధ్యక్షుడు

దసరా శరన్నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. ఆఖరి రోజు బెజవాడ దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. భారీగా చేరుకుంటున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి 2 గంటల నుంచే రద్దీ పెరిగింది. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. భవానీలతో కృష్ణవేణి ఘాట్‌ నిండిపోయింది. ఆ తల్లి చల్లని చూపు కోసం సామాన్య భక్తులతోపాటు ప్రముఖులూ కొండపైకి చేరుకుంటున్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉన్నతాధికారులు కొందరు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి:కడపలో కమనీయంగా దసరా ఉత్సవాలు

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న..డీజీపీ, మంత్రులు, భాజపా రాష్ట్రాధ్యక్షుడు

దసరా శరన్నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. ఆఖరి రోజు బెజవాడ దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. భారీగా చేరుకుంటున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి 2 గంటల నుంచే రద్దీ పెరిగింది. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. భవానీలతో కృష్ణవేణి ఘాట్‌ నిండిపోయింది. ఆ తల్లి చల్లని చూపు కోసం సామాన్య భక్తులతోపాటు ప్రముఖులూ కొండపైకి చేరుకుంటున్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉన్నతాధికారులు కొందరు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి:కడపలో కమనీయంగా దసరా ఉత్సవాలు

Intro:Ap_vsp_46_08_virigina_rail_patta_Av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా కసింకోట మండలం పరవాడ పాలెం సమీపంలోని రంగుబొలు గెడ్డ వద్ద రైలు పట్టా విరిగింది గమనించిన స్థానికులు రైల్వే అధికారులు విషయం తెలిపారు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో రైలు పట్టా విరగడంటొ ఈ ప్రాంతంలోనే గూడ్స్ రైలు నిలిచిపోయింది రైల్వే సిబ్బంది వచ్చి విరిగిన రైలు పట్టా మరమత్తు చేపడుతున్నారు
Body:విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే మార్గంలోనే రైలు పట్టా కలవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉదయం వెళ్లాల్సిన జన్మభూమి ఉదయ ఎక్స్ప్రెస్ రైలు దువ్వాడ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారుConclusion:దసరాకి ఇంటికి వెళదామని రైల్లో ప్రయాణం చేసేవారికి పట్టా విరగడంతో రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడడంతో స్టేషన్లో నిరీక్షించాల్సి వచ్చింది
Last Updated : Oct 8, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.