ETV Bharat / state

కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు...లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Sep 13, 2020, 9:51 PM IST

కృష్ణాజిల్లాలో పలు మండలాల్లో ఆదివారం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మచిలిపట్నంలో కురుస్తున్న వర్షం
మచిలిపట్నంలో కురుస్తున్న వర్షం


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షపు నీరు బస్టాండులోకి ప్రవేశించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మున్నేరులో వరద ప్రవాహం మొదలైంది. క్రమక్రమంగా నీటి ఉధృతి పెరిగింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద పది అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

తిరువూరు నియోజకవర్గంలో రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువూరులో 15.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. పట్టణంలోని 13 వార్డు, రాజుపేట, పాత తిరువూరు, మండలంలోని లక్ష్మీపురం బీసీ కాలనీలో నివాస గృహాలు ముంపునకు గురయ్యాయి.

ఇదీ చదవండి

మోపిదేవి ఆలయాన్ని దర్శించుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షపు నీరు బస్టాండులోకి ప్రవేశించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మున్నేరులో వరద ప్రవాహం మొదలైంది. క్రమక్రమంగా నీటి ఉధృతి పెరిగింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద పది అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

తిరువూరు నియోజకవర్గంలో రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువూరులో 15.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. పట్టణంలోని 13 వార్డు, రాజుపేట, పాత తిరువూరు, మండలంలోని లక్ష్మీపురం బీసీ కాలనీలో నివాస గృహాలు ముంపునకు గురయ్యాయి.

ఇదీ చదవండి

మోపిదేవి ఆలయాన్ని దర్శించుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.