ETV Bharat / state

అక్రమంగా మద్యం, గంజాయి, గుట్కా తరలిస్తున్న 8 మంది అరెస్ట్ - అక్రమ మద్యం,గంజాయి, గుట్కా తరలింపు

కృష్ణా, కడప జిల్లాల ఎస్పీ ఆదేశాల మేరకు పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి, గుట్కా, మద్యం తదితర మత్తుపదార్థాలు అక్రమంగా రవాణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా మద్యం, గంజాయి,గుట్కా తరలిస్తున్న 8 మంది అరెస్ట్
అక్రమంగా మద్యం, గంజాయి,గుట్కా తరలిస్తున్న 8 మంది అరెస్ట్
author img

By

Published : Dec 8, 2020, 9:15 PM IST


ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న గుట్కా, రెండు కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

నందిగామలో  గుట్కా పట్టివేత
నందిగామలో గుట్కా పట్టివేత

వీరులపాడు మండలంలో పెద్దాపురం గూడెం, మాధవరం జయంతి గ్రామాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నందిగామ రూరల్ సీఐ సతీష్ తెలిపారు. నిషేధిత గుట్కా, గంజాయి, ఇసుక వంటివి అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంకిపాడులో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 4కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కంకిపాడులో  ఇద్దరు అరెస్ట్
కంకిపాడులో ఇద్దరు అరెస్ట్

ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప జిల్లా రైల్వేకోడూరులో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. ఎస్.ఉప్పరపల్లి సమీపంలో 348 కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను రేపు నందలూరు కోర్టులో హాజరుపరుస్తామని కోడూరు ఎస్​ఈబీ ఇన్​స్పెక్టర్​ రామ్మోహన్ తెలిపారు.

ఇవీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా కేసులు, నలుగురు మృతి


ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న గుట్కా, రెండు కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

నందిగామలో  గుట్కా పట్టివేత
నందిగామలో గుట్కా పట్టివేత

వీరులపాడు మండలంలో పెద్దాపురం గూడెం, మాధవరం జయంతి గ్రామాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నందిగామ రూరల్ సీఐ సతీష్ తెలిపారు. నిషేధిత గుట్కా, గంజాయి, ఇసుక వంటివి అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంకిపాడులో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 4కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కంకిపాడులో  ఇద్దరు అరెస్ట్
కంకిపాడులో ఇద్దరు అరెస్ట్

ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప జిల్లా రైల్వేకోడూరులో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. ఎస్.ఉప్పరపల్లి సమీపంలో 348 కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను రేపు నందలూరు కోర్టులో హాజరుపరుస్తామని కోడూరు ఎస్​ఈబీ ఇన్​స్పెక్టర్​ రామ్మోహన్ తెలిపారు.

ఇవీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా కేసులు, నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.