ETV Bharat / state

రాజకీయ కక్షతో కొల్లు రవీంద్రపై కేసు: తెదేపా నేతలు - మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు

వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని అరెస్టుల పేరుతో వేధిస్తున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ ఆరోపించారు. తెదేపా ముఖ్య నేతలే లక్ష్యంగా వైకాపా రాజకీయ విద్వేషాలకు పాల్పడుతుందని విమర్శించారు. మచిలీపట్నం వైకాపా నాయకుడు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించాలని చూస్తున్నారన్నారు.

రాజకీయ కక్షతో కొల్లు రవీంద్రపై కేసు : కొనకళ్ల
రాజకీయ కక్షతో కొల్లు రవీంద్రపై కేసు : కొనకళ్ల
author img

By

Published : Jul 3, 2020, 2:44 PM IST

రాజకీయ విద్వేషంతో ప్రతిపక్ష నాయకులపై పెడుతున్న కేసుల విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సూచించారు. మచిలీపట్నం వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడిగా పేర్కొనడాన్ని కొనకళ్లతోపాటు మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు తప్పుబట్టారు.

వైకాపా ప్రభుత్వం తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విరుద్ధపాలన జరుగుతుందని విమర్శించారు. మోకా భాస్కరరావు హత్యకేసులో అసలు నిందితులను పట్టుకునే విషయంలో తమవంతు సహకారం అందిస్తామన్నారు. రాజకీయ కారణాలతో కొల్లు రవీంద్రపై కేసు బనాయించాలని చూడటం సరికాదని హితవు పలికారు.

రాజకీయ విద్వేషంతో ప్రతిపక్ష నాయకులపై పెడుతున్న కేసుల విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సూచించారు. మచిలీపట్నం వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడిగా పేర్కొనడాన్ని కొనకళ్లతోపాటు మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు తప్పుబట్టారు.

వైకాపా ప్రభుత్వం తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విరుద్ధపాలన జరుగుతుందని విమర్శించారు. మోకా భాస్కరరావు హత్యకేసులో అసలు నిందితులను పట్టుకునే విషయంలో తమవంతు సహకారం అందిస్తామన్నారు. రాజకీయ కారణాలతో కొల్లు రవీంద్రపై కేసు బనాయించాలని చూడటం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి : అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హడావుడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.