ETV Bharat / state

'జీవనమే కష్టమైన వేళ.. అంతంత బిల్లులు ఎలా కడతారు..?' - కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని తంగిరాల సౌమ్య డిమాండ్

లాక్ డౌన్ కారణంగా నెలన్నరగా ఇంటికే పరిమితమైన పేదప్రజలు.. అధిక విద్యుత్ ఛార్జీలు ఎలా కడతారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశ్నించారు. 2 నెలల కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

former mla tangiraala sowmya fires on ycp government on high electricity bills
తంగిరాల సౌమ్య
author img

By

Published : May 14, 2020, 8:53 PM IST

పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామ విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయలో.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినతిపత్రం అందించారు. 2 నెలల బిల్లులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్​తో పేద, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని.. జీవనం సాగించడమే కష్టమైన నేపథ్యంలో అంతంత కరెంట్ బిల్లులు ఎలా కడతారని ప్రశ్నించారు.

గత ఎన్నికల ప్రచారంలో వైకాపా ఇచ్చిన ఉచిత కరెంట్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులను పాత పద్ధతిలోనే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజల పక్షాన తెదేపా న్యాయపోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.

పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామ విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయలో.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినతిపత్రం అందించారు. 2 నెలల బిల్లులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్​తో పేద, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని.. జీవనం సాగించడమే కష్టమైన నేపథ్యంలో అంతంత కరెంట్ బిల్లులు ఎలా కడతారని ప్రశ్నించారు.

గత ఎన్నికల ప్రచారంలో వైకాపా ఇచ్చిన ఉచిత కరెంట్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులను పాత పద్ధతిలోనే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజల పక్షాన తెదేపా న్యాయపోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి.. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కృష్ణా జిల్లాకు ప్రయోజనాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.