విజయవాడ వన్టౌన్లోని మాజేటి కాజు హౌస్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లేబుల్స్ లేని ప్యాకింగ్స్, రంగులు కలిసిన పప్పు ధాన్యాలతో పాటు కాజు షాప్ పేరుతో కిరణా వస్తువుల అమ్మతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎంత ప్రముఖ షాపు అయినా లేబుల్స్ లేని వస్తువులను కొనొద్దని ప్రజలను కోరారు. బిల్స్ లేకుండా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని సూచించారు. కాజు హౌస్లో కొన్ని శాంపిల్స్ను ల్యాబ్కు పంపి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు.
ఇవీ చూడండి: