ETV Bharat / state

CHILDRENS DEAD: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు - krishna district crime news

CHILDRENS DEAD: సంక్రాంతి సెలవులు సరదాగా గడుపుదామనుకున్న ఆ స్నేహితులను మృత్యువు ఇసుక గుంతల రూపంలో కబళించింది. ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులను మున్నేరు మింగేసింది. ఇంటి నుంచి ఆడూతూ పాడుతూ వెళ్లిన బిడ్డలు ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉండి ఉంటారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. ఐదుగురు చిన్నారుల మృతితో కృష్ణా జిల్లా ఏటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు...ఐదుగురు చిన్నారులు మృతి
ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు...ఐదుగురు చిన్నారులు మృతి
author img

By

Published : Jan 11, 2022, 12:23 PM IST


CHILDRENS DEAD: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో మున్నేరులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా స్నేహితులందరూ కలిసి గ్రామం చివర ఉన్న ఏటికి ఈతకు వెళ్లారు. సాయంత్రమైనా చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. అన్నిచోట్లా వెతికారు. మున్నేటి ఒడ్డున సైకిళ్లు, చెప్పులు, దుస్తులు కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏటి మధ్యలో గట్టుపై ఎక్కడో ఒకచోట బిడ్డలు క్షేమంగా ఉంటారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు విగతజీవులుగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

మృతులు ఏటూరుకు చెందిన గురజాల చరణ్‌, కర్ల బాలయేసు, జెట్టి అజయ్‌, మాగులూరి సన్నీ, మైలా రాకేశ్‌గా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన చిన్నారులు... గతంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన గుంతలు గుర్తించక నీట మునిగి చనిపోయారు. తొలుత ఈతగాళ్లు, జాలర్లతో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. మున్నేరు జల్లెడపట్టిన బృందం ఒక్కొక్క మృతదేహాన్ని వెలికితీసింది. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘటనా స్థలికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చారు.

ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు
ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు

ఇదీ చదవండి:

RGV TWEET: సినిమా టికెట్‌ ధరలపై మరోసారి ట్విటర్‌లో స్పందించిన ఆర్జీవీ


CHILDRENS DEAD: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో మున్నేరులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా స్నేహితులందరూ కలిసి గ్రామం చివర ఉన్న ఏటికి ఈతకు వెళ్లారు. సాయంత్రమైనా చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. అన్నిచోట్లా వెతికారు. మున్నేటి ఒడ్డున సైకిళ్లు, చెప్పులు, దుస్తులు కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏటి మధ్యలో గట్టుపై ఎక్కడో ఒకచోట బిడ్డలు క్షేమంగా ఉంటారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు విగతజీవులుగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

మృతులు ఏటూరుకు చెందిన గురజాల చరణ్‌, కర్ల బాలయేసు, జెట్టి అజయ్‌, మాగులూరి సన్నీ, మైలా రాకేశ్‌గా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన చిన్నారులు... గతంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన గుంతలు గుర్తించక నీట మునిగి చనిపోయారు. తొలుత ఈతగాళ్లు, జాలర్లతో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. మున్నేరు జల్లెడపట్టిన బృందం ఒక్కొక్క మృతదేహాన్ని వెలికితీసింది. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘటనా స్థలికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చారు.

ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు
ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు

ఇదీ చదవండి:

RGV TWEET: సినిమా టికెట్‌ ధరలపై మరోసారి ట్విటర్‌లో స్పందించిన ఆర్జీవీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.