హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న.. గరుడ ఏసీ బస్సులో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు సమీపంలో.. ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.
అప్రమత్తమైన డ్రైవర్.. బస్సులో ప్రయాణికులను వెంటనే కిందికి దింపాడు. వాహనంలోని అగ్నిమాపక పరికరంతో.. పొగ, మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో అక్కడినుంచి పంపించాడు.
ఇదీ చదవండి: రెండు లారీలు-కారు ఢీ.. క్యాబిన్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్లు