ETV Bharat / state

విధుల నుంచి తొలగించండపై ఫీల్డ్ అసిస్టెంట్​ అభ్యంతరం

author img

By

Published : Feb 13, 2021, 8:23 PM IST

రాజకీయ కారణలతో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారని ఓ ఫీల్డ్ అసిస్టెంట్ 100 మంది ఉపాధి హామీ మేటీలతో కలిసి కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. పెదప్రోలు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న డి. రాజశేఖర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఇచ్చిన ఆదేశాలు అవాస్తవమని వాటిని అధికారులు నిరూపిస్తే తానే విధుల నుంచి వైదులొగుతానని స్పష్టం చేశాడు.

Field Assistant objected to dismissal
పదవి నుంచి తొలగించండపై ఫీల్డ్ అసిస్టెంట్​ అభ్యంతరం.

స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనే అభియోగంతో కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న డి.రాజశేఖర్​ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు ఫీల్డ్ అసిస్టింట్ దాదాపు 100 మంది ఉపాధి హామీ మేటీలతో కలిసి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. కేవలం రాజకీయ కారణాలతో తనను తొలగించారని కార్యాలయం ముందు రాజశేఖర్ బైఠాయించారు. దీనిపై అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. అనంతరం ఎంపీడీఓతో మాట్లాడిన రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు చూపిస్తే తానే విధుల నుంచి వైదొలుగుతానని చెప్పారు. రాజీనామా చేస్తానని చెప్పడంతో అధికారులు మరొక్కసారి విచారణ జరిపి ఎన్నికల్లో పాల్గొంటే సస్పెండ్ చేస్తామని లేకపోతే తన విధులు నిర్వహించుకోవచ్చునని ఉపాధిహామీ పథకం ఏపీడీ శ్రీలత తెలిపారు.

ఇదీ చదవండి:

స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనే అభియోగంతో కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న డి.రాజశేఖర్​ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సదరు ఫీల్డ్ అసిస్టింట్ దాదాపు 100 మంది ఉపాధి హామీ మేటీలతో కలిసి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. కేవలం రాజకీయ కారణాలతో తనను తొలగించారని కార్యాలయం ముందు రాజశేఖర్ బైఠాయించారు. దీనిపై అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. అనంతరం ఎంపీడీఓతో మాట్లాడిన రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు చూపిస్తే తానే విధుల నుంచి వైదొలుగుతానని చెప్పారు. రాజీనామా చేస్తానని చెప్పడంతో అధికారులు మరొక్కసారి విచారణ జరిపి ఎన్నికల్లో పాల్గొంటే సస్పెండ్ చేస్తామని లేకపోతే తన విధులు నిర్వహించుకోవచ్చునని ఉపాధిహామీ పథకం ఏపీడీ శ్రీలత తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.