స్పెషల్ పోలీసులమంటూ వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్న యువకులను కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటకు చెందిన కిర్రా శివనరేంద్ర, గోపాలకృష్ణ అనే ఇద్దరు యువకులు మరో వ్యక్తి సాయంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
ఇటీవల హైదరాబాద్ నుంచి చిల్లకల్లు వస్తున్న కారును ఆపి వారి నుంచి రూ. 3 వేలు వసూలు చేశారని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి..