ETV Bharat / state

'సిబ్బంది ముందే గుర్తించి కంప్లైంట్​ చేశారు- కానీ వారు మాత్రం పట్టించుకోలేదు' - Tirumala Laddu Issue in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 1 hours ago

Tirumala Laddu Issue in AP : ఒకప్పుడు తిరుమలలోని ఏ వీధుల్లో తిరిగిన శ్రీవారి లడ్డూ ఘుమఘుమలే. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోని వచ్చిన అనంతరం శ్రీవారి లడ్డూ మిఠాయి కొట్లలోని ఒక సరకుగానే మారిపోయింది. నాణ్యతను పక్కన పెట్టి నాసిరకం నెయ్యి, జీడిపప్పు, యాలకులను వినియోగించారు. దీంతో రుచి, సువాసన పూర్తిగా మారిపోయింది.

TIRUMALA LADDU ISSUE IN AP
TIRUMALA LADDU ISSUE IN AP (ETV Bharat)

Tirumala Laddu Issue in AP : తిరుమలలోని ఏ మాడ వీధిలో తిరిగినా గతంలో లడ్డూ ఘుమఘుమలు. ఆ సువాసన పీలిస్తే ఏదో తెలియని అనుభూతి. స్వామి ప్రసాదాన్ని స్వీకరించినంత ఆనందం పొందేవారు భక్తులు. అదంతా గతం. జగన్​ సర్కార్​ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో తిరుపతి లడ్డూను మిఠాయి కొట్లలోని ఒక సరకుగానే చూశారు. లడ్డూ నాణ్యతను పక్కనబెట్టి నాసిరకం నెయ్యి, జీడిపప్పు, యాలకులు ఇతరత్రా సామగ్రిని ఉపయోగించారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి లడ్డూ ఇచ్చినా స్వీకరిస్తారన్న అహంకారంతో గత ప్రభుత్వం వ్యవహరించింది. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసిరకం దినుసులు, కల్తీ నెయ్యి వాడారు. దీంతో రుచి, సువాసన పూర్తిగా మారిపోయింది. ఈ అంశంపై భక్తులతో పాటు పోటు సిబ్బంది అధికారుల దృష్టికి తీసువెళ్లారు.

తిరుమలలో పెరిగిన శ్రీవారి లడ్డూ విక్రయాలు - వారం రోజుల్లో ఎన్ని కొనుగోలు చేశారంటే? - Tirumala laddu sales increased

నెయ్యి బాగోలేదన్నా చర్యలు తీసుకోలేదు : శ్రీవారి ఆలయంలో రోజుకు సుమారు 3.5 లక్షల లడ్డూలను సిబ్బంది తయారు చేస్తారు. ఇందుకు 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. ఈ సందర్భంలోనే తిరుమలలో 82,100 కిలోల సామర్థ్యంతో మూడు నెయ్యి యూనిట్లును ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మేరకు లడ్డూలు సరఫరా చేయాల్సిన నేపథ్యంలో 40 థర్మోఫ్లూయిడ్‌ స్టవ్‌లతో బూందీపోటును ఏర్పాటు చేశారు. గతంలో లడ్డూను తయారు చేసేందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం నెయ్యి వినియోగించడాన్ని తొలుత బూందీపోటులో పనిచేసే సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని అనేక సార్లు డిప్యూటీ, ఈవో సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకువెళ్లారు. అయిన ఎలాంటి ప్రయోజనం లేదు. సాధారణంగా బూందీ, నెయ్యి కలిపే సమయంలో సువాసన వస్తుంది. పుర వీధుల్లో తిరుగుతున్న భక్తులు ఈ సువాసనను ఆస్వాదించేవారు. నాసిరకం నెయ్యి వినియోగించినప్పటి నుంచి లడ్డూ తయారు చేసేటప్పుడే కనీసం సువాసన వచ్చేది కాదని కొంత మంది పోటు సిబ్బంది వెల్లడించారు.

శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్‌ విచారణలో విస్తుపోయే అంశాలు - Srivari Prasadam Controversy

భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా : నెయ్యిని చూస్తేనే దాని ప్రమాణాలు గుర్తించవచ్చని బూందీపోటు సిబ్బంది తెలియజేశారు. ఈ విషయం అధికారులకు ఎందుకు అర్థం కాలేదో తెలియట్లేదన్నారు. గతంలో దూరంగా ఉన్నా సంచీలో లడ్డూ ఉంటే ఆ వాసనకే తిరుమలకు వెళ్లి వచ్చారా అని గుర్తించే పరిస్థితి ఉండేది. జగన్​ సర్కారు హయాంలో చేతిలో పట్టుకున్నా వాసన తెలియని దుస్థితి నెలకొందని బూందీ పోటు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి అని వాపోయారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం గతంలో లడ్డూ దూరంగా ఉన్నా సువాసన వచ్చేదని, గత ఐదేళ్లలో అది కనిపించలేదన్నా విషయాన్ని వెల్లడించారు. నిత్యం లడ్డూ తయారు చేసే పోటు సిబ్బంది, మాజీ ప్రధాన అర్చకుడు సైతం వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కనీసం పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని సరఫరాదారులు కల్తీ నెయ్యిని పంపి శ్రీవారికి ద్రోహం చేయడంతో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని కొంతమంది వారి అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

Tirumala Laddu Issue in AP : తిరుమలలోని ఏ మాడ వీధిలో తిరిగినా గతంలో లడ్డూ ఘుమఘుమలు. ఆ సువాసన పీలిస్తే ఏదో తెలియని అనుభూతి. స్వామి ప్రసాదాన్ని స్వీకరించినంత ఆనందం పొందేవారు భక్తులు. అదంతా గతం. జగన్​ సర్కార్​ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో తిరుపతి లడ్డూను మిఠాయి కొట్లలోని ఒక సరకుగానే చూశారు. లడ్డూ నాణ్యతను పక్కనబెట్టి నాసిరకం నెయ్యి, జీడిపప్పు, యాలకులు ఇతరత్రా సామగ్రిని ఉపయోగించారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి లడ్డూ ఇచ్చినా స్వీకరిస్తారన్న అహంకారంతో గత ప్రభుత్వం వ్యవహరించింది. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసిరకం దినుసులు, కల్తీ నెయ్యి వాడారు. దీంతో రుచి, సువాసన పూర్తిగా మారిపోయింది. ఈ అంశంపై భక్తులతో పాటు పోటు సిబ్బంది అధికారుల దృష్టికి తీసువెళ్లారు.

తిరుమలలో పెరిగిన శ్రీవారి లడ్డూ విక్రయాలు - వారం రోజుల్లో ఎన్ని కొనుగోలు చేశారంటే? - Tirumala laddu sales increased

నెయ్యి బాగోలేదన్నా చర్యలు తీసుకోలేదు : శ్రీవారి ఆలయంలో రోజుకు సుమారు 3.5 లక్షల లడ్డూలను సిబ్బంది తయారు చేస్తారు. ఇందుకు 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. ఈ సందర్భంలోనే తిరుమలలో 82,100 కిలోల సామర్థ్యంతో మూడు నెయ్యి యూనిట్లును ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మేరకు లడ్డూలు సరఫరా చేయాల్సిన నేపథ్యంలో 40 థర్మోఫ్లూయిడ్‌ స్టవ్‌లతో బూందీపోటును ఏర్పాటు చేశారు. గతంలో లడ్డూను తయారు చేసేందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం నెయ్యి వినియోగించడాన్ని తొలుత బూందీపోటులో పనిచేసే సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని అనేక సార్లు డిప్యూటీ, ఈవో సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకువెళ్లారు. అయిన ఎలాంటి ప్రయోజనం లేదు. సాధారణంగా బూందీ, నెయ్యి కలిపే సమయంలో సువాసన వస్తుంది. పుర వీధుల్లో తిరుగుతున్న భక్తులు ఈ సువాసనను ఆస్వాదించేవారు. నాసిరకం నెయ్యి వినియోగించినప్పటి నుంచి లడ్డూ తయారు చేసేటప్పుడే కనీసం సువాసన వచ్చేది కాదని కొంత మంది పోటు సిబ్బంది వెల్లడించారు.

శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్‌ విచారణలో విస్తుపోయే అంశాలు - Srivari Prasadam Controversy

భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా : నెయ్యిని చూస్తేనే దాని ప్రమాణాలు గుర్తించవచ్చని బూందీపోటు సిబ్బంది తెలియజేశారు. ఈ విషయం అధికారులకు ఎందుకు అర్థం కాలేదో తెలియట్లేదన్నారు. గతంలో దూరంగా ఉన్నా సంచీలో లడ్డూ ఉంటే ఆ వాసనకే తిరుమలకు వెళ్లి వచ్చారా అని గుర్తించే పరిస్థితి ఉండేది. జగన్​ సర్కారు హయాంలో చేతిలో పట్టుకున్నా వాసన తెలియని దుస్థితి నెలకొందని బూందీ పోటు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి అని వాపోయారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం గతంలో లడ్డూ దూరంగా ఉన్నా సువాసన వచ్చేదని, గత ఐదేళ్లలో అది కనిపించలేదన్నా విషయాన్ని వెల్లడించారు. నిత్యం లడ్డూ తయారు చేసే పోటు సిబ్బంది, మాజీ ప్రధాన అర్చకుడు సైతం వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కనీసం పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని సరఫరాదారులు కల్తీ నెయ్యిని పంపి శ్రీవారికి ద్రోహం చేయడంతో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని కొంతమంది వారి అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.