ETV Bharat / state

పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు పంపిణీ

author img

By

Published : Apr 21, 2020, 5:43 PM IST

లాక్​డౌన్​తో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతబడ్డాయి. మందిరాల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో బ్రాహ్మణులు, పురోహితులకు ఆదాయం తగ్గిపోయింది. ఫలితంగా వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి సొసైటీ సభ్యులు... వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

Distribution of essential commodities to poor Brahmins in vijayawada
పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు పంపిణీ

విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు... బ్రాహ్మణులు, పురోహితులకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా పురోహితులు పనులు లేక ఇబ్బందులు పడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వారందరినీ ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థల తరుఫున సహాయం అందిస్తున్నామని విష్ణు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తూ గృహాలకే పరిమితం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదీచదవండి.

విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు... బ్రాహ్మణులు, పురోహితులకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా పురోహితులు పనులు లేక ఇబ్బందులు పడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వారందరినీ ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థల తరుఫున సహాయం అందిస్తున్నామని విష్ణు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తూ గృహాలకే పరిమితం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదీచదవండి.

'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.