ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా.. పేదలకు దాతలు అండగా.. - Distribution of Essential needs at kadapa district

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు, వలస కూలీలకు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, దాతలు అండగా నిలిచారు.

Distribution of Essential Commodities for Migrant Workers
వలస కూలీలకు నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : May 24, 2020, 7:30 PM IST

కృష్ణా జిల్లాలో...

కాలినడకన, రైళ్లలో స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు.. విజయవాడలోని స్వచ్ఛంద సంస్థలు ఆహార, పానీయాలు అందచేశాయి. కేరళలోని కొట్టాయం నుంచి లక్నోకు వెళ్తున్న శ్రామిక్ రైలు విజయవాడలో కొద్దిసేపు ఆగింది. ఆ సమయంలో వలస కూలీలకు జ్యూస్, బిస్కెట్, మజ్జిగ, అరటికాయలను అమృత హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కరుణశ్రీ అందచేశారు. రైలులో 1600 మందిగా పైగా ప్రయాణికులున్నట్లు ఆమె తెలిపారు.

కృష్ణా జిల్లా మైలవరంలో సాయిసేవాదళ్ ఆధ్వర్యంలో మండుటెండలో ప్రయాణిస్తున్న బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రత తగ్గేవరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సేవాదళ్ అధ్యక్షుడు బాలాజీ ప్రసాద్ తెలిపారు.

చేనేత కార్మికులకు చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ ఆపన్న హస్తం అందించారు. 150 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకేట్ తో కలిపిన నిత్యావసర కిట్లను అందించారు. ముఖ్య అతిధిగా చల్లపల్లి తహసీల్దార్ కె. స్వర్ణమేరి పాల్గొన్నారు.

కోడూరు లోని వీవర్స్ కాలనీలో 400 కుటుంబాలకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా కూరగాయల పంపిణీ చేసారు.

తూర్పుగోదావరి జిల్లా...

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో రహదారులపై లారీల్లో, బస్సుల్లో వెళ్లే వలస కూలీల కు అల్పాహారం, భోజన సదుపాయాన్ని అందించారు. 1000 ఆహార పొట్లాలు తయారుచేసి వలస కూలీలకు పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లాలో...

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు నెల్లూరులోని పాండురంగ అన్నదాన సమాజం వారు అన్నదానం చేశారు. దాతల సహకారంతో ప్రతి రోజు రెండు వందల మందికి అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకుడు ప్రవీణ్ తెలిపారు.

అనంతపురం జిల్లాలో...

లాక్​డౌన్ కారణంగా మధ్యప్రదేశ్ కు చెందిన దాదాపు 33 మంది వలసకూలీలకు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కొంత మంది దాతలు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కడప జిల్లాలో...

కడప జిల్లా రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్​లో డీఎస్పీ చేతుల మీదగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం నాయకులు ఆటో కార్మికులకు బియ్యం, కాయగూరలను అందజేశారు.

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన సాయిరామ్ మెస్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంచారు. పోలీసుల సహకారంతో వెయ్యి మంది వలస కార్మికులకు ఆహారం అందజేశారు. వైశ్య రాజు వెంకట కృష్ణంరాజు , ఏఎస్సై నాగభూషణరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఆరోగ్యసేతు'పై ఆందోళన- గోప్యతకు భరోసా ఏదీ?

కృష్ణా జిల్లాలో...

కాలినడకన, రైళ్లలో స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు.. విజయవాడలోని స్వచ్ఛంద సంస్థలు ఆహార, పానీయాలు అందచేశాయి. కేరళలోని కొట్టాయం నుంచి లక్నోకు వెళ్తున్న శ్రామిక్ రైలు విజయవాడలో కొద్దిసేపు ఆగింది. ఆ సమయంలో వలస కూలీలకు జ్యూస్, బిస్కెట్, మజ్జిగ, అరటికాయలను అమృత హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కరుణశ్రీ అందచేశారు. రైలులో 1600 మందిగా పైగా ప్రయాణికులున్నట్లు ఆమె తెలిపారు.

కృష్ణా జిల్లా మైలవరంలో సాయిసేవాదళ్ ఆధ్వర్యంలో మండుటెండలో ప్రయాణిస్తున్న బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల తీవ్రత తగ్గేవరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సేవాదళ్ అధ్యక్షుడు బాలాజీ ప్రసాద్ తెలిపారు.

చేనేత కార్మికులకు చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ ఆపన్న హస్తం అందించారు. 150 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకేట్ తో కలిపిన నిత్యావసర కిట్లను అందించారు. ముఖ్య అతిధిగా చల్లపల్లి తహసీల్దార్ కె. స్వర్ణమేరి పాల్గొన్నారు.

కోడూరు లోని వీవర్స్ కాలనీలో 400 కుటుంబాలకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా కూరగాయల పంపిణీ చేసారు.

తూర్పుగోదావరి జిల్లా...

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో రహదారులపై లారీల్లో, బస్సుల్లో వెళ్లే వలస కూలీల కు అల్పాహారం, భోజన సదుపాయాన్ని అందించారు. 1000 ఆహార పొట్లాలు తయారుచేసి వలస కూలీలకు పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లాలో...

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు నెల్లూరులోని పాండురంగ అన్నదాన సమాజం వారు అన్నదానం చేశారు. దాతల సహకారంతో ప్రతి రోజు రెండు వందల మందికి అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకుడు ప్రవీణ్ తెలిపారు.

అనంతపురం జిల్లాలో...

లాక్​డౌన్ కారణంగా మధ్యప్రదేశ్ కు చెందిన దాదాపు 33 మంది వలసకూలీలకు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కొంత మంది దాతలు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కడప జిల్లాలో...

కడప జిల్లా రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్​లో డీఎస్పీ చేతుల మీదగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం నాయకులు ఆటో కార్మికులకు బియ్యం, కాయగూరలను అందజేశారు.

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన సాయిరామ్ మెస్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంచారు. పోలీసుల సహకారంతో వెయ్యి మంది వలస కార్మికులకు ఆహారం అందజేశారు. వైశ్య రాజు వెంకట కృష్ణంరాజు , ఏఎస్సై నాగభూషణరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఆరోగ్యసేతు'పై ఆందోళన- గోప్యతకు భరోసా ఏదీ?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.