ETV Bharat / state

'ఉరితాళ్లుగా మారనున్న నూతన వ్యవసాయ బిల్లులు' - వ్యవసాయ బిల్లులపై మైలవరం కాంగ్రెస్ ధర్నా

దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. పలువురు కాంగ్రెస్ నాయకులు.. కృష్ణా జిల్లా మైలవరంలోనూ ఇదే విషయంపై నిరసన చేపట్టారు. రైతుల పొట్టకొట్టే బిల్లులను రద్దుచేయాలని పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇంఛార్జ్ నరసింహారావు డిమాండ్ చేశారు.

congress protest
కాంగ్రెస్ పార్టీ నిరసన
author img

By

Published : Oct 17, 2020, 4:14 PM IST

నూతన వ్యవసాయ బిల్లులు.. రైతుల పాలిట ఉరితాళ్లుగా మారడం తథ్యమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇంఛార్జ్ నరహరిశెట్టి నరసింహారావు విమర్శించారు. కృష్ణా జిల్లా మైలవరంలో నియోజకవర్గ బాధ్యులు బొర్రా కిరణ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్రంలోని అధికార భాజపా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నరసింహారావు వ్యతిరేకించారు. అన్నదాతను నట్టేట ముంచే జీవోలను రద్దు చేయాలంటూ.. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి నినాదాలు చేశారు.

నూతన వ్యవసాయ బిల్లులు.. రైతుల పాలిట ఉరితాళ్లుగా మారడం తథ్యమని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇంఛార్జ్ నరహరిశెట్టి నరసింహారావు విమర్శించారు. కృష్ణా జిల్లా మైలవరంలో నియోజకవర్గ బాధ్యులు బొర్రా కిరణ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్రంలోని అధికార భాజపా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నరసింహారావు వ్యతిరేకించారు. అన్నదాతను నట్టేట ముంచే జీవోలను రద్దు చేయాలంటూ.. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

'బీసీ కార్పొరేషన్ ఖజానా ఖాళీ చేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.