కృష్ణా జిల్లా విజయవాడ నియోజకవర్గ పరిధిలోని మైలవరం, జి.కొండూరు మండలాల ప్రజలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్ జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ది పొందిన టైలర్లు, ఆటో డ్రైవర్లు, నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి.. ఎయిర్పోర్టు నిర్మాణానికి జీఎంఆర్తో ప్రభుత్వం ఒప్పందం