ETV Bharat / state

జోరుగా కోడి పందేలు.. కోట్లాది రూపాయలు బెట్టింగ్​

author img

By

Published : Jan 14, 2023, 1:48 PM IST

Updated : Jan 14, 2023, 8:08 PM IST

Cockfight in AP: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో..మొదటి రోజైన భోగి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులంతా వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఉత్సహంగా జరుపుకుంటుంటే..కోడి పందేల నిర్వాకులు వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇష్టారీతిగా కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ తతంగాన్ని చూస్తూన్న అధికార యంత్రాంగం మాత్రం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోంది.

AP state
ఏపీలో జోరుగా కోడి పందేలు

Cockfight in AP: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి కొలాహలంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో.. మొదటి రోజైనా భోగి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులంతా వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఉత్సహంగా జరుపుకుంటున్నారు. ఇటువంటి సమయంలో కోడి పందేల నిర్వాహకులు పందేంరాయుళ్లను ఆకర్షించటం కోసం వందల కోట్ల రూపాయలకు తెర తీశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నిర్వాకులు ఇష్టారీతిగా కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ తతంగాన్ని చూస్తున్న అధికార యంత్రాంగం చూసిచూడనట్టుగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

25 ఎకరాల్లో కోడిపందేల బరులు: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఊరూరా బరులు కొలువుదీరాయి. అధికార వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బరులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బాపులపాడు మండలం అంపాపురంలో సుమారు 25 ఎకరాల్లో కోడిపందేలు, జూద, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన బరులను ఏర్పాటు చేసి, పందెం రాయుళ్లకు తగిన వసతులను కల్పిస్తున్నారు. శేరినరసన్నపాలెం, కొత్తపల్లి, వేలేరు, గోపవరపుగూడెం, చిన్నఅవుటపల్లి, తెంపల్లి, బీబీగూడెం, ముస్తాబాద, అంబాపురంలో వెయ్యి నుంచి 2వేల మందితో కూడిన కోడిపందేల శిబిరాలను నిర్వహిస్తున్నారు. సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతికి కోడిపందేలు, పేకాట యథామాములే అంటూ పోలీసులు సైతం చూసీచూడనట్లు ఉండటంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా బరుల్లో పందెం రాయుళ్ల నుంచి కోట్ల రూపాయలు చేతులు మారుతుండటం సంచలనంగా మారింది. మరో రెండ్రోజుల పాటు ఈ బరులు కొనసాగనుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బరుల వద్ద బౌన్సర్లతో రక్షణ: మరోపక్క ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో కోడిపందేలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు కత్తులు కట్టి కోళ్లను బరిలోకి దించుతున్నారు. అంతేకాదు కోడిపందేల బరుల వద్ద బౌన్సర్లతో రక్షణ కల్పిస్తున్నారు. జాలిపూడి, చాటపర్రులో జోరుగా గుండాట, నిడమర్రు, మందలపర్రులో నిర్వాహకులు.. డిజిటల్ స్క్రీన్లలో లైవ్ పెట్టి మరీ కోడిపందేలను నిర్వహిస్తున్నారు. దీంతో పందేలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మరికొన్ని చోట్ల సంక్రాంతి సంబరాల పేరుతో బోర్డులు పెట్టి, లోపల మాత్రం కోడిపందేలను నిర్వహిస్తున్నారు.

బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలు: పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు ఈసారి బరుల నిర్వాహకులు.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో కోడి పందేలు ఆడేవారికి బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలను ఆఫర్లుగా ప్రకటించారు. రూ.2 లక్షల విలువైన కోడిపందేలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండిని, లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీని బహుమతులుగా అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు, వాటిని బరుల వద్దే ప్రదర్శనకు ఉంచి పందెంరాయుళ్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ తతంగాన్ని అంతా చూస్తున్న పోలీసులు.. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి

Cockfight in AP: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి కొలాహలంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో.. మొదటి రోజైనా భోగి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులంతా వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఉత్సహంగా జరుపుకుంటున్నారు. ఇటువంటి సమయంలో కోడి పందేల నిర్వాహకులు పందేంరాయుళ్లను ఆకర్షించటం కోసం వందల కోట్ల రూపాయలకు తెర తీశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నిర్వాకులు ఇష్టారీతిగా కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ తతంగాన్ని చూస్తున్న అధికార యంత్రాంగం చూసిచూడనట్టుగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

25 ఎకరాల్లో కోడిపందేల బరులు: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఊరూరా బరులు కొలువుదీరాయి. అధికార వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బరులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బాపులపాడు మండలం అంపాపురంలో సుమారు 25 ఎకరాల్లో కోడిపందేలు, జూద, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన బరులను ఏర్పాటు చేసి, పందెం రాయుళ్లకు తగిన వసతులను కల్పిస్తున్నారు. శేరినరసన్నపాలెం, కొత్తపల్లి, వేలేరు, గోపవరపుగూడెం, చిన్నఅవుటపల్లి, తెంపల్లి, బీబీగూడెం, ముస్తాబాద, అంబాపురంలో వెయ్యి నుంచి 2వేల మందితో కూడిన కోడిపందేల శిబిరాలను నిర్వహిస్తున్నారు. సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతికి కోడిపందేలు, పేకాట యథామాములే అంటూ పోలీసులు సైతం చూసీచూడనట్లు ఉండటంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా బరుల్లో పందెం రాయుళ్ల నుంచి కోట్ల రూపాయలు చేతులు మారుతుండటం సంచలనంగా మారింది. మరో రెండ్రోజుల పాటు ఈ బరులు కొనసాగనుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బరుల వద్ద బౌన్సర్లతో రక్షణ: మరోపక్క ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో కోడిపందేలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు కత్తులు కట్టి కోళ్లను బరిలోకి దించుతున్నారు. అంతేకాదు కోడిపందేల బరుల వద్ద బౌన్సర్లతో రక్షణ కల్పిస్తున్నారు. జాలిపూడి, చాటపర్రులో జోరుగా గుండాట, నిడమర్రు, మందలపర్రులో నిర్వాహకులు.. డిజిటల్ స్క్రీన్లలో లైవ్ పెట్టి మరీ కోడిపందేలను నిర్వహిస్తున్నారు. దీంతో పందేలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మరికొన్ని చోట్ల సంక్రాంతి సంబరాల పేరుతో బోర్డులు పెట్టి, లోపల మాత్రం కోడిపందేలను నిర్వహిస్తున్నారు.

బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలు: పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు ఈసారి బరుల నిర్వాహకులు.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో కోడి పందేలు ఆడేవారికి బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలను ఆఫర్లుగా ప్రకటించారు. రూ.2 లక్షల విలువైన కోడిపందేలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండిని, లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీని బహుమతులుగా అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు, వాటిని బరుల వద్దే ప్రదర్శనకు ఉంచి పందెంరాయుళ్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ తతంగాన్ని అంతా చూస్తున్న పోలీసులు.. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి

Last Updated : Jan 14, 2023, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.