కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో ఓ వస్త్ర వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రామానికి చెందిన వస్త్ర వ్యాపారి జ్వరంతో బాధపడుతున్నాడు. అతను గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షల్లో అతనికి పాజిటివ్ రావడంతో సంబంధిత వైద్యులు ఈ సమాచారాన్ని జిల్లా వైద్య అధికారులకు అందజేశారు. వారు కంకిపాడు మండల అధికారులకు తెలుపగా.. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని గన్నవరం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నివసించే వీధి, తన దుకాణం ఉన్న ప్రాంతాల్లో అధికారులు రసాయన ద్రావణాన్ని పిచికారి చేయించారు.
ఇదీ చూడండి. 'నిన్నే సర్జరీ అయిందని చెప్పినా వినలేదు'