ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు - పోలీస్​స్టేషన్​లో సీసీ కెమెరాలు

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ సీసీ కెమెరాల నిఘా పెరగనుంది. లాకప్ డెత్ లు, అక్రమ కస్టడీలు వంటి ఆరోపణల దృష్ట్యా ఠాణాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పోలీసుల విధులను పారదర్శకంగా నిర్వర్తించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుపై తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది

CCTV cameras in police stations
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు
author img

By

Published : Mar 1, 2021, 2:05 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు

లాకప్ డెత్ లు, అక్రమ కస్టడీలు వంటి ఆరోపణల దృష్ట్యా.. రాష్ట్ర వ్యాప్తంగా ఠాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీస్​స్టేషన్​లో లాకప్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల విధుల్లో పారదర్శకత పెంచేందుకు స్టేషన్‌లలో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.

పోలీస్ స్టేషన్లలో సీసీకెమెరాలు అమర్చాలని గతేడాది డిసెంబరులో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 10 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా పెనుగంచిప్రోలు స్టేషన్‌లోని లాకప్ గదిలో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ఇందులో ఎక్కువ కాలం బ్యాకప్ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశ ద్వారం, పార్కింగ్, ప్రాంతాల్లో రెండవ దశలో కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

1372 పోలీస్ స్టేషన్‌లలో కెమెరాలు..

తొలిదశలో ప్రతి స్టేషన్‌లో... స్త్రీ, పురుషుల లాకప్‌లకు ఒక్కొక్కటి చొప్పున కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1372 పోలీస్ స్టేషన్‌లలో కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి డీజీపీ నివేదిక పంపనున్నారు. ఇందులో అమర్చనున్న సీసీకెమెరాల్లో ఆడియో కూడా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. తెదేపా నేతల గృహ నిర్బంధం

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు

లాకప్ డెత్ లు, అక్రమ కస్టడీలు వంటి ఆరోపణల దృష్ట్యా.. రాష్ట్ర వ్యాప్తంగా ఠాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీస్​స్టేషన్​లో లాకప్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల విధుల్లో పారదర్శకత పెంచేందుకు స్టేషన్‌లలో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.

పోలీస్ స్టేషన్లలో సీసీకెమెరాలు అమర్చాలని గతేడాది డిసెంబరులో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 10 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా పెనుగంచిప్రోలు స్టేషన్‌లోని లాకప్ గదిలో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ఇందులో ఎక్కువ కాలం బ్యాకప్ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశ ద్వారం, పార్కింగ్, ప్రాంతాల్లో రెండవ దశలో కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

1372 పోలీస్ స్టేషన్‌లలో కెమెరాలు..

తొలిదశలో ప్రతి స్టేషన్‌లో... స్త్రీ, పురుషుల లాకప్‌లకు ఒక్కొక్కటి చొప్పున కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1372 పోలీస్ స్టేషన్‌లలో కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి డీజీపీ నివేదిక పంపనున్నారు. ఇందులో అమర్చనున్న సీసీకెమెరాల్లో ఆడియో కూడా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.