ETV Bharat / state

రుణమాఫీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: మంత్రి కన్నబాబు - Chandrababu posed challenges on the issue of debt.

రుణమాఫీ జీవో రద్దుపై.. తెదేపా నేతల విమర్శలు, ఆరోపణలకు బదులిచ్చారు.. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. ఈ విషయంపై చర్చకు సిద్ధమా అని.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాల్ విసిరారు.

Ask us if the guarantees are not met in these five years
author img

By

Published : Sep 26, 2019, 7:49 PM IST

రుణమాఫీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: మంత్రి కన్నబాబు

రుణమాఫీ జీవో రద్దుపై.. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పందించారు. తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. చర్చకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి సున్నావడ్డీ పథకానికీ మంగళం పాడారని ఆరోపించారు. మిగతా రూ.87 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కమిటీలు వేసి కోత విధించి.. రైతులకు మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏడాది ముందుగానే రైతు భరోసా పథకం అమలు చేస్తోందన్నారు. అక్టోబర్‌ 15 నుంచి ఒకేసారి 64.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నట్టు తెలిపారు. రైతురుణ ఉపశమనంతో పోలిస్తే... అదనంగా 27.38 లక్షల మందికి లబ్ది కలుగుతుందని వివరించారు.

రుణమాఫీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: మంత్రి కన్నబాబు

రుణమాఫీ జీవో రద్దుపై.. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పందించారు. తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. చర్చకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి సున్నావడ్డీ పథకానికీ మంగళం పాడారని ఆరోపించారు. మిగతా రూ.87 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కమిటీలు వేసి కోత విధించి.. రైతులకు మొండిచేయి చూపారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏడాది ముందుగానే రైతు భరోసా పథకం అమలు చేస్తోందన్నారు. అక్టోబర్‌ 15 నుంచి ఒకేసారి 64.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నట్టు తెలిపారు. రైతురుణ ఉపశమనంతో పోలిస్తే... అదనంగా 27.38 లక్షల మందికి లబ్ది కలుగుతుందని వివరించారు.

ఇదీ చూడండి

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణం: సోమిరెడ్డి

యాంకర్ వాయిస్= రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్ర లో అయినటువంటి కడప జిల్లా చక్రాయపేట మండలం మారెళ్ళ మడక గ్రామంలో గండి వీరాంజనేయ స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరిగి దేవాదాయ శాఖకు అప్పగించారు . రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో గండి క్షేత్రం గత నెల ఆగస్టు 28వ తారీఖున టీటీడీ లోకి విలీనం జరిగిన విషయం విధితమే అయితే ఇందుకు సంబంధించిన 347 సవాలు చేస్తూ ఒక భక్తుడు ఆశ్రయించాడు . దీనికి హైకోర్టు జీవోను రద్దు చేసి తిరిగి గండిక్షేత్రం టిటిడి నుండి దేవాదాయ శాఖకు అప్పగించారు. ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా ఈరోజు టిటిడి డిప్యూటీ ఈవో గోవింద రాజన్ పద్ధతి ప్రకారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మరియు గండి ఈవో సహాయ కమిషనర్ పట్టం గురు ప్రసాద్ కు అప్పగించారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.