ETV Bharat / state

జగన్‌ మోహన్‌ రెడ్డీ వేరే ఆలోచన చేయకండీ!

ఇప్పుడున్న భవనాలు 80 శాతం పూర్తయ్యాయని..కాస్త వెచ్చిస్తే మిగిలిన పనులు పూర్తవుతాయని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. దీనికోసం ప్రభుత్వం వేరే ఆలోచన చేయవలసిన అవరసరం లేదని స్పష్టం చేశారు.

author img

By

Published : Aug 30, 2019, 10:29 AM IST

ఏపీసీసీ ఉపాధ్యాక్షుడు తులసిరెడ్డి మీడియా సమావేశం
ఏపీసీసీ ఉపాధ్యాక్షుడు తులసిరెడ్డి మీడియా సమావేశం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఆ మేరకు అసెంబ్లీ ఆమోదం లభించిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడలోని మీడియా సమావేశం ద్వారా అన్నారు. 1937లో శ్రీబాగ్ ఒడంబడికలో జరిగిన ఒప్పందం మేరకు రాయలసీమలో, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి కృషి చేయాలనీ సూచించారు. ఇప్పటికే రాజధాని అమరావతిలోని చాలావరకు భవనాలు 80 శాతం పూర్తయ్యాయని, అవి తాత్కాలికమో, శాశ్వతమో ఏమైనా కావచ్చు..కాని నిర్మాణాలు జరిగాయన్నది వాస్తవమన్నారు. ఇప్పుడు ఆ భవనాల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూర్చుని పరిపాలన చేస్తున్నారని.. నిర్మాణాలు జరుగుతున్న భవనాలు రాజధానికి సరిపోతాయి కాబట్టి ప్రభుత్వం కాస్త వెచ్చిస్తే మిగతావి పూర్తవుతాయన్నారు. ఇటువంటి సందర్భంలో వేరే ఆలోచన అవసరం లేదని ఇప్పుడు ఉన్న చోటే రాజధానిని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఆదాయం ఇప్పటికే మందగించిందని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ఇదీ చూడండి:సీఆర్​డీఏపై సీఎం సమీక్ష... కొనసాగుతున్న ఉత్కంఠ..!

ఏపీసీసీ ఉపాధ్యాక్షుడు తులసిరెడ్డి మీడియా సమావేశం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఆ మేరకు అసెంబ్లీ ఆమోదం లభించిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడలోని మీడియా సమావేశం ద్వారా అన్నారు. 1937లో శ్రీబాగ్ ఒడంబడికలో జరిగిన ఒప్పందం మేరకు రాయలసీమలో, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి కృషి చేయాలనీ సూచించారు. ఇప్పటికే రాజధాని అమరావతిలోని చాలావరకు భవనాలు 80 శాతం పూర్తయ్యాయని, అవి తాత్కాలికమో, శాశ్వతమో ఏమైనా కావచ్చు..కాని నిర్మాణాలు జరిగాయన్నది వాస్తవమన్నారు. ఇప్పుడు ఆ భవనాల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూర్చుని పరిపాలన చేస్తున్నారని.. నిర్మాణాలు జరుగుతున్న భవనాలు రాజధానికి సరిపోతాయి కాబట్టి ప్రభుత్వం కాస్త వెచ్చిస్తే మిగతావి పూర్తవుతాయన్నారు. ఇటువంటి సందర్భంలో వేరే ఆలోచన అవసరం లేదని ఇప్పుడు ఉన్న చోటే రాజధానిని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఆదాయం ఇప్పటికే మందగించిందని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ఇదీ చూడండి:సీఆర్​డీఏపై సీఎం సమీక్ష... కొనసాగుతున్న ఉత్కంఠ..!

Intro:AP_TPT_31_11_morayimchina_poling_avb_c4 శ్రీకాళహస్తిలో ప్రారంభమైన పోలింగ్ .ఊరందూరు లో ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి.


Body:శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 289 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది .శ్రీకాళహస్తి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు పది చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓట్లు పక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తన సొంత ఊరు ఊరందూరు లో ఓటు హక్కును వినియోగించుకున్నారు .ఓటింగ్ యంత్రాలు మొరాయించడం పై అసహనం వ్యక్తం చేశారు .ఎన్నికల అధికారులు సక్రమంగా శిక్షణ లేకుండా విధులకు హాజరు కావడం తోనే ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


Conclusion:శ్రీకాళహస్తి ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ. ఊరందూరు ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. ఈటీవీ న్యూస్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.

For All Latest Updates

TAGGED:

vijayawada
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.