కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం సీతారామపురంలో ఏఎన్ఎం కరేమా (30) ఆత్మహత్యకు పాల్పడింది. వత్సవాయి మండలం పెద్ద మోదుగ పల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహించే ఈమె.. అనారోగ్యంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రికి తరలించేసరికే ఏఎన్ఎం మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కరేమాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవీ చదవండి: