ETV Bharat / state

'డాక్టర్​ సుధాకర్ కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తే మీకేంటి బాధ'

author img

By

Published : May 25, 2021, 3:45 PM IST

డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తే కొందరు నాయకులు విమర్శించటాన్ని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తప్పుపట్టారు. తెదేపాని విమర్శించే బదులు.. సుధాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హితవు పలికారు.

vangalapudi anitha
వంగలపూడి అనిత

డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తే కొందరు నాయకులకు ఎందుకంత బాధ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. తెదేపాని తప్పుపట్టే బదులు.. సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి న్యాయం చేయాలని ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు.

శవ రాజకీయాలకు మారుపేరు ఇప్పుడు అధికారంలో ఉన్నవారేనని ప్రజలకు బాగా తెలుసని విమర్శించారు. శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించింది... బాబాయ్ శవాన్ని బాత్రూమ్‌లో ఉంచిందెవరో ప్రజలకు బాగా తెలుసన్నారు. కొవిడ్ నియంత్రణలో రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపాడంటే ఎవరైనా నమ్ముతారా అని వంగలపూడి అనిత నిలదీశారు.

డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తే కొందరు నాయకులకు ఎందుకంత బాధ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. తెదేపాని తప్పుపట్టే బదులు.. సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి న్యాయం చేయాలని ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు.

శవ రాజకీయాలకు మారుపేరు ఇప్పుడు అధికారంలో ఉన్నవారేనని ప్రజలకు బాగా తెలుసని విమర్శించారు. శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించింది... బాబాయ్ శవాన్ని బాత్రూమ్‌లో ఉంచిందెవరో ప్రజలకు బాగా తెలుసన్నారు. కొవిడ్ నియంత్రణలో రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపాడంటే ఎవరైనా నమ్ముతారా అని వంగలపూడి అనిత నిలదీశారు.

ఇదీ చదవండి

డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులకు లోకేశ్ పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.