మెడికల్ కౌన్సిలింగ్ లో జీవో నంబర్ 550ను పరిగణలోకి తీసుకోవాలని విద్యార్ది సంఘాలు డిమాండ్ చేశాయి. జీవో నెంబర్ 550 పై విజయవాడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు, వివిద ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. జీవోను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే, వైద్య విద్యలో బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోయారని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అన్నారు. కౌన్సిలింగ్ లో జరిగిన అవకతవకలపై కోర్టును ఆశ్రయించగా, కోర్టు త్రిసభ్య కమిటీని నియమించిందన్నారు. జీవో ను పరిగణలోకి తీసుకోకుండానే కౌన్సెలింగ్ నిర్వహించడం వల్లే విద్యార్దులు నష్టపోయారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రికౌన్సెలింగ్ జరిపించాలని డిమాండ్ చేసారు.
ఇదీ చూడండి:మద్యం మత్తులో వాహనాలు నడిపితే... ప్రాణాలు చిత్తే !